30
మహర్షుల చరిత్రలు
వైకుంఠపురమున నిజభవనమును జూపి “వత్సా! ఈ చరాచరము జలరూపమున నావరించి వరుణాభిధేయుఁడ నగు నారాయణుఁడను నేనే. నీవు మద్భక్తుఁడ వగుట దీనిని గంటివి ఏతద్దర్శన ఫలముకతన నీ కేకాలమునను జేటు లేదు. "పొ" మ్మని వీడ్కొలుపుటను దెలిపి వాని నాశ్చర్యమగ్ను నొనర్చెను [1]
"అగస్త్యగీత:" " ఆగస్త్య సంహిత."
అగస్త్యమహర్షి లోకోత్తరపురుషుఁడై యాజీవితాంతము జగద్ధితమునకై పాటుపడినవిశ్వశ్రేయస్కరుఁడు. మహాభారతమందలి శాంతిపర్వమున వెలయు నీతని ప్రసిద్ధ మహా విద్యాబోధనయే యగస్త్య గితానామమునఁ జిరస్థాయియై నిల్చినది. మఱియు, నీ మహర్షి రామచంద్ర విష్ణునామవాద్యవతార పూజావిధానము శాస్త్రోక్తముగాఁ దెలిపియుండెను. ఇదియే "యగస్త్యసంహిత " యనఁ బరగుచున్నది. [2]
అగస్త్యమహర్షి జీవితమంతయుఁ బ్రసిద్ధ బ్రహ్మవిద్యాబోధకమే యైయున్నది. ఈతని తత్త్వసారమంతయు;
"శివుఁడే దాత శివుండె భోక్త శివుఁడే
చేయున్ మఖాదిక్రియల్
శివుఁడే విశ్వము నే శివుండ ....."
నను నద్భుతాద్వైతానుసంథానమునఁ బ్రవ్యక్తమైన దనఁ జెల్లును. సతీసహితుఁడై సమస్తతీర్థములఁ గ్రుంకివచ్చి యగస్త్యమహర్షి దేహశుద్ధికి యమనియమాదులకు నవి యవసరములే యైనను :
"తీర్థములుమాననములు ముక్తిప్రదములు"
"బాహ్యతీర్థావళులు ముక్తిఫలము నీవు"
అని తన సాధ్వీమణికిఁ దీర్థపరమార్ధమును వెల్లడించినాఁడు.