పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

మహర్షి దేవేంద్రనాధశాకూ, స్వీయచరిత్రము.


మార్గశిర మాసము సగము సాగిన పిమ్మట నోక ప్రాతః కాలము నిద్రనుండి లేవగనే బయటకు రాగా పర్వతము పాదము నుండి శిఖర మువరకు మంచుతో నవరింపబడి సర్వమును 'శ్వేతముగా నుండుట ఉత్ఫుల్ల నేత్రములతో తిలకించితిని, గిరి రాజు శుభ్రరజతవస్త్రము ధరించెను. తుషార శీతలవాయునిశ్వాసము నేనిదే ప్రధమమున నను భవించితిని.కాలము గడచిన కొలదియు శీతల మధికము కాజొచ్చేను. ఒక దినము గారు మేఘములనుండి ఒడికిన దూదిపింజెలవలె మంచు పడు చుండుట గాంచితిని. ఇదివరలో ఘనీభవించిన నుంచుగడ్డను మాత్రము చూచియుడుటచే అదియును మంచుగడ్డవలె భారముగను కఠిన ముగ నుండునని భావించితిని. కాని యిప్పుడు చూడగ నది ఉన్ని వలెనే పలుచగను తేలికగ నుండెను. వస్త్రము దులిపినచో మంచు పడి పోయి వస్త్రము యధాప్రకారముగ పొడిగనే యుండును. పుష్య మాసము సందొక దినము పాతః కాలము లేచి చూడగ రెండు మూడ డుగుల యెత్తు మంచుపడి మార్గములన్నిటిని ఆటంక షరచెను. కూలీలు వచ్చి ఆమంచును బద్దలకొట్టి దారి చేసిరి. అప్పుడు ప్రజులు తిరిగి నడువ సాగిరి. నేను కౌతూహలావిష్టుడనై అమంచుమీదనే నడువసాగితిని. నా ప్రాతఃకాల విహారము మానలేదు. స్ఫూర్తితోను ఆనందముతోను నేనెంతయో దూరము, ఎంతయో వేగముగ డచితిని. ఆ శీతకాల హిమమునందు నేను గ్రీష్మము ననుభవించితిని. అడుగున ధరించిన దుస్తులు చమటతో తపిసి పోయెను. ఆ కాలమునందలి నాబలమునకును ఆరోగ్యమునకును ఇది చిహ్నముగ నుండెను. ప్రతిదినము ప్రాతః కాల మునందు "నేనీరీతిగా ఆనందముతో బహదూరము బ్రమణము చేయు చుంటిని, పిమ్మట తేనీరు, క్షీరము నారగించుచుంటిని. రెండుజాముల వేళ స్నానము చేయునప్పుడును మంచునీళ్ళను నేను స్వహస్తములతో