పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

మహాపురుషుల జీవితములు



యీవిద్యార్థివేతనము సంపాదించెను. తలిదండ్రులకు నిర్బాధకముగా దానుజదువుకొనుట కాధారమైన యావిద్యార్థివేతనముదనకు మహోపకారముచేసెనని యాయన యిటీవలపలుమాఱులు చెప్పుచువచ్చెను. అట్లు తానుపుచ్చుకొన్న విద్యార్థివేతనపుసొమ్మును రామయ్యంగారు ఋణముగా నెంచుకొని దానిని దీర్పఁ దలచి కొంత మూలధనమును తన్నిమిత్తమిచ్చి దానివడ్డివల్ల పట్టపరీక్షకుఁ బ్రకృతిశాస్త్రముజదువ దలఁచు విద్యార్థికి సహాయము జేయవలసినదని యేర్పాటు చేసి విద్య ముగిసినతోడనే యాకాలమున రివిన్యూబోర్డువారికి సెక్రటరిగా నుండిన పైప్రాపుదొర రామయ్యంగారిని తనకచేరీలో మహారాష్ట్రభాషకుఁ దర్జుమాదారుగ నేర్పరచెను. రివిన్యూబోర్డులో నిట్లుకొంత కాలము పనిచేయుట చేత రివిన్యూపద్ధతుల దెలిసికొనుట కాయన కెన్నో యవకాశములు కలిగెను. క్రమక్రమముగా రామయ్యంగారు పూనికతో బనిజేయుటవలన జాలమంది కలక్టర్ల కనుగ్రపాత్రుఁడయ్యెను. 1850 వ సంవత్సరమందు నెల్లూరు కలక్టరు తనకచ్చరీలో నున్న హెడ్డుమున్షీ పని రామయ్యంగారి కిచ్చెను. ఈయుద్యోగములో నీతడు నాలుగు సంవత్సరములుండెను. 1854 వ సంవత్సరమందు గవర్నమెంటువారు ఇంజనీరింగు డిపార్టుమెంటు క్రొత్తగా నిర్మించి యా శెక్రటెరిగారివద్ద రామయ్యంగారినిఁ బనిచేయఁ బంపిరి. అందులో గొంతకాల మున్నపిదప 1855 వ సంవత్సరమున నాయన యధికారులు రెండుద్యోగములు కనబఱచి యాయన యిష్టమువచ్చిన దానిలోనికి వెళ్లుమనిరి. మొదటిది నెల్లూరుజిల్లాలో నాయన సిరస్తదారు పని. రెండవది కృష్ణాజిల్లాలోనప్పుడేక్రొత్తగా నేర్పడిన సబుకలెక్టరు వద్ద సిరస్తదారుపని. రామయ్యంగారు తానదివఱకు కొంతకాలము పనిచేసిన నెల్లూరికేవెళ్ళి యక్కడికలక్టరు నమ్మకమునకుఁబాత్రుడై శ్రద్ధగా పనిజేసెను. ఈయుద్యోగమున రెండేండ్లున్న పిదప నతఁడు