పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాజుల లక్ష్మీనర్సు శెట్టి

255



ఆ మహజరులోనున్న ముఖ్యాంశములివి. హిందూదేశమున వచ్చు బాధలన్నియు మితిమీరిన పన్నులవలనను వానిని వసూలుచేయు క్రూర పద్ధతుల వలనను గవర్నమెంటువారి కోర్టులలో జరుగు నాలస్యము దుర్య్యయము మొదలగు వానివలనను సంభవించుచున్నవి. మాకు ముఖ్యముగా గావలసినవి మంచిరోడ్లు వంతెనలు చేల కదును దప్పకుండ నీరిచ్చు కాలువలు పల్లెటూళ్ళ బాలురకు విద్యనేర్పు బాఠశాలలు మొదలగునవి గవర్నమెంటు పరిపాలనావిషయమున జేయు వ్యయము తగ్గింపవలయును. దేశ మభివృద్ధి పొందునట్లు ప్రజలు సుఖపడునట్లు గవర్నమెంటువారు ప్రభుత్వము చేయవలయును. పై సంగతు లన్నిటిని వ్రాసి వారా మహజరులలో చిట్టచివర నీక్రింది వాక్యముల బొందుపరచిరి. "హిందూదేశపాలన మిప్పుడున్నట్లు కంపెనీవారి చేతిలోనున్నను సరే లేక మరియొకరి చేతిలోనున్నను సరే. పాలించుపద్ధీతిలో మార్పులు కాలానుసారముగ నభివృద్ధులు తప్పకనుండవలయును. ఆమార్పులు మూడేండ్లకొకసారిగాని లేనిచో నై దేండ్లకొకసారిగాని దేశముయొక్క స్థితినిబట్టి యవసరములనుబట్టి చేయుచుండవలయును. విశాలమైన యీ దేశమునందుండు ప్రజలు తమపడు సంకటములు తెలిసికొని పైవారికి దెలుపుకొనుటకును, దెలుపుకొనినపిదప తగినవిచారణజరుగుటకుపార్ల మెంటుమహాసభలో నప్పుడప్పుడు హిందూదేశ విషయమున జర్చలు జరుగుచుండవలయును. ఇక్కడదొరతనము చేయువారు జాగ్రత్తతో ప్రజాపాలనము చేయుచున్నవారో లేదో కనుగొనుటకు సీమలోనున్న యధికారులు వీరు చేయుపనులను శ్రద్ధతో విమర్శింపు చుండవలయును."

ఈపై మహజరు 1853 వ సంవత్సరం ఫిబ్రవరినెల 25 వ తారీఖున పార్ల మెంటు ప్రభుసభలో నెల్లింబ్రాప్రభువుగారు దాఖలుచేసిరి. ఆసభలో మఱియొక ప్రభువు హిందూ డేశ విషయమునఁ బ్రసంగిం