పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

మహాపురుషుల జీవితములు



చుచు సభికులతో నిట్లని చెప్పెను. 'ఈమహజరులోనున్న సంగతులు సత్యములని తెలుపుటకు హిందూ దేశస్థులవలన వ్రాయబడిన యుత్తరములు రెండు నావద్ద నున్నవి. ఆయుత్తరములు వ్రాసినవారు పెద్ద మనుష్యులు యోగ్యులు మనవలెనే వారు నింగ్లీషు చక్కగా వ్రాయగలరు మాటలాడగలరు. ఆయిద్దరిలో నొకరు లక్ష్మీనర్సు శెట్టి గారు ఆయన 1853 వ సంవత్సరం జనవరి 24 తారీఖున నాపేర నీక్రింది విధముగా నుత్తరము వ్రాసినారు. "మేము పడుచున్న బాములను విచారణసేయుట కొక ప్రత్యేకసభ యేర్పడునేని మేము చెప్పిన విషయములన్నియు కన్నులకు గట్టినట్లు ఋజువు కాగలవు. అవి వివరించుటలో సాక్ష్యములు తీసికొనుట వలననేగాని మఱియొక లాగున యూరపుఖండమువారికి దెలియదు.

అని యాప్రభువు లక్ష్మీనర్సు శెట్టి మాటలయందు మిక్కిలి గౌరవము నమ్మికగలిగి మాటలాడెను. ఆసంవత్సరమే పార్లమెంటు సభలోఁ బ్రధానసభికుఁడు లోకానుభవము గలవాఁడు నగు బ్రైడుదొరగారు లక్ష్మీనర్సు శెట్టి వ్రాసిన యుత్తరములు తాను జూచినట్లె వాని మాటలు తనకు సత్యములని తోఁచినట్లు చెప్పి హిందూదేశస్థులు పడు బాధలను విచారణసేయుటకుఁ ప్రత్యేకసభ నొకదాని నేర్పరుపవలసినదని పట్టుపట్టెను. లక్ష్మీనర్సు శెట్టి వెనుక పంపించిన మహజర్లతోదృప్తినొందక హిందూ దేశప్రభుత్వముకంపెనీవారియొద్ద నుండి తీసుకుని యింగ్లాండు రాజుగారు స్వయముగా బరిపాలించిన బాగుండునని ప్రార్థించుచు పదునాలుగువేల జనులచేత వ్రాళ్ళు చేయించి పార్లమెంటుకు మఱియొక మహజరుపంపించెను. చెన్నపట్టణమందు లక్ష్మీనర్సు శెట్టియు బొంబాయియందు కొందరు బంగాళము నందు మఱికొందరు బడిన పరిశ్రమచేత పార్లమెంటువారు మనదేశ ప్రభుత్వము కంపెనీవారివద్దనుండి తీసికొనక పోయినను కొన్ని