పుట:Kumbharaana020881mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

రాణా : ఏమది?

బల : రాణిగారికి చికిత్సచేయుటకు నిన్నటిదినమున ఎవరో యిద్దరు వైదేశిక వైద్యులు వచ్చియుండిరి. వారును వచ్చినట్లే పోయిరి. అప్పుడు రాణిగారివద్ద సుశీలయనుదాసి యుండినది. ఈనాఁడు అదిఏదోయొకహారము వేసికొని తిరుగుచున్నదని ఇంకొక దాసి వాసంతిక చెప్పెను. దానిని పిలిపించితిని; అది ధరించుకొన్న హారము అమూల్య వజ్రహారముగా కనుపట్టినది.

రాణా : ఈవిషయము చిత్రముగనున్నది. దాసి ఏమి? వజ్రహారమును ధరించు టేమి ? దాని నిటకు పిలిపింపుఁడు.

బల : ఎవడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : స్వామి.

బల : రాణిగారి పెద్దదాసిని సుశీలను ఇచ్చటకుఁ దోడ్కొనిరమ్ము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

రాణా : ఆదాసి యెచ్చటనైన దొంగిలించి యుండునా ?

బల : అది సామాన్యభాగ్యవంతులు వేసికొను హారముగాదు. దొంగిలించియుండిన అంత:పురముననే దొంగిలించి యుండవలయును.

[సుశీల మెడలో హారమువేసికొన్ యోరపైటతో కల్కునడకతో ప్రవేశించును]

సుశీల : [స్వగతము] రాజుగారు నన్నెప్పుడు పిలిపించేవారుగారు. ఈదండ మహత్తెంవల్ల నాకేదో యదృష్టం పట్టేలాగుంది. [సిగ్గు నభినయించుచు] నీళ్ళల్లో లోతు, మనుసులో మర్మం యెవరికి తెలుస్తుంది ! [పైటసవరించుకొని హారము దిద్దుకొని] దాసురాలిని [దండముపెట్టును.]

రాణా : [సుశీల మెడలోని హారమును పరికించును.]

సుశీ : [స్వగతము] రాజుగారు నా వోరపైటమీదనే కన్ను వేశారు