52 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు
రాణా : ఏమది?
బల : రాణిగారికి చికిత్సచేయుటకు నిన్నటిదినమున ఎవరో యిద్దరు వైదేశిక వైద్యులు వచ్చియుండిరి. వారును వచ్చినట్లే పోయిరి. అప్పుడు రాణిగారివద్ద సుశీలయనుదాసి యుండినది. ఈనాఁడు అదిఏదోయొకహారము వేసికొని తిరుగుచున్నదని ఇంకొక దాసి వాసంతిక చెప్పెను. దానిని పిలిపించితిని; అది ధరించుకొన్న హారము అమూల్య వజ్రహారముగా కనుపట్టినది.
రాణా : ఈవిషయము చిత్రముగనున్నది. దాసి ఏమి? వజ్రహారమును ధరించు టేమి ? దాని నిటకు పిలిపింపుఁడు.
బల : ఎవడురా అక్కడ ?
ద్వారపాలకుఁడు : స్వామి.
బల : రాణిగారి పెద్దదాసిని సుశీలను ఇచ్చటకుఁ దోడ్కొనిరమ్ము.
ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]
రాణా : ఆదాసి యెచ్చటనైన దొంగిలించి యుండునా ?
బల : అది సామాన్యభాగ్యవంతులు వేసికొను హారముగాదు. దొంగిలించియుండిన అంత:పురముననే దొంగిలించి యుండవలయును.
[సుశీల మెడలో హారమువేసికొన్ యోరపైటతో కల్కునడకతో ప్రవేశించును]
సుశీల : [స్వగతము] రాజుగారు నన్నెప్పుడు పిలిపించేవారుగారు. ఈదండ మహత్తెంవల్ల నాకేదో యదృష్టం పట్టేలాగుంది. [సిగ్గు నభినయించుచు] నీళ్ళల్లో లోతు, మనుసులో మర్మం యెవరికి తెలుస్తుంది ! [పైటసవరించుకొని హారము దిద్దుకొని] దాసురాలిని [దండముపెట్టును.]
రాణా : [సుశీల మెడలోని హారమును పరికించును.]
సుశీ : [స్వగతము] రాజుగారు నా వోరపైటమీదనే కన్ను వేశారు