పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నందనావాప్తికై కాదె నాభి కశ్య
పాత్రిదక్షాదిపుణ్యు లాయాసపడుట
తలఁచిచూడుడు వారికిఁ గలవొ లేవొ
వనతటాకాది సంతానవైభవములు.

156


క.

చనియెదరు నీతిపద్ధతి
ననియెద రుచితోక్తిసరణి నత్యాప్తులరై
మనియెద రనియుండితి మి
ట్లనయుల రగుటెన్నఁడెఱుఁగ మంచుం బెలుచన్.

157


చ.

సమధికసూక్ష్మపక్ష్మనికషానుకషాయితవీక్షణద్యుతుల్
దము నునుగెంపు దువ్వలువ దట్టఁపురంగు పొసంగఁజేయ భూ
రమణునికిన్కఁ గన్గొని ధరాధరధైర్యధురంధరుండు చి
త్తమునఁ గలంగెనంచును బ్రధానవరుల్ సభయాంతరంగులై.

158


క.

భూనాయక! నీదగు సం
తానేచ్ఛాదృఢత దెలియఁదలఁచి యనుటయే
కాని యొండొకటి సేయం
బూనుదుమే! యిట్టులనుట పోలునె మమ్మున్.

159


శా.

సమ్యక్సౌమ్యపురూరవశ్ఛదకనచ్చాఖాంచితంబున్ మరు
ద్గమ్యంబై విలసిల్లు శీతరుచిసత్సంతానసంతాన మౌ
పమ్యశ్రీ నిరసించి యుష్మదురుపుష్పప్రాప్తిఁ జెన్నొంది సం
భ్రామ్యత్సూర్యళియై భవత్సుతఫలప్రారంభముం గోరదే!

160


తే.

మంచి దింతట నేమయ్యె మనుజనాథ!
మన పురంబున కేఁగి సమ్మదము మిగుల
బ్రహ్మవిదులైన శ్రీమహాభాగవతుల
నడిగి వారల యానతి నడువ వలయు.

161


అని సచివు లిట్లు పలికెడు
సునయోక్తుల కియ్యకొని యశోధనుఁడగు న