పుట:Krxshhiivaludu (1924).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొలముల బీళులం దిరిగి ప్రొద్దెడగ్రుంకగ నిల్లుసేరి పా
పల నొడిచుట్టు బెట్టుకొని భార్యను నన్నము దెమ్మటంచు వే
పిలిచెద, వొంటికాపురము, పిల్లల గిల్లల బుజ్జగించుకో
వలసిన యాలిపాటు దలపం గరుణింప వదేల హాలికా. 100


ఉప్పుతో దొమ్మిది యున్న కాపురములు
          సేయు గృహిణుల కేచిక్కు లేదు,
ఎవ్విలేకున్నను నిరుగు పొరుగు కులాం
          గనలకు చేయొగ్గి గైకొనుటకు
నిష్టపడక, యున్నదే పెట్టి యక్కఱ
          వాపుకొనెడు మానవతుల కెందు
లేమిడి సంసార మేమెయి పరువుతో
          గడపంగ నిక్కట్లు గలుగుచుండు
నెన్ని కష్టములున్న నిట్లని పలుకక
          పొసగినయంతకు బొదువుచేసి

మగనికి బిడ్డలకు బెట్టి మిగిలియున్న
యింత దా దిని భిక్షున కిడు పురంధ్రి
శాంతి నీతియు నురుకష్టసహనశక్తి
నెవరెఱుంగుదు రంతటి యింతి దక్క! 101