పుట:Krxshhiivaludu (1924).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థులయట్లె యీకవియు మితభాషి. అర్థము ఎక్కువ పదములు తక్కువ అను శ్లాఘనకు పాత్రుడు.

మనుచరిత్ర, కళాపూర్ణోదయాదులలోని పద్యముల ననుకరించిన తలపోతలు వ్రాతలు ఒకటిరెండు చోటుల నున్నట్లు తోచెడిని. ఇది దోషముగాదు. ప్రమాదము కావచ్చును. వీరి యాథార్థ్యవర్ణనాశక్తిని చూపించుటకై కొన్ని పద్యముల నుదహరించు చున్నాను.

చలువగల కప్పురము చిలికినటు చల్లనయి
     లలిత కలధౌత మృదువిలసనము పోలెన్‌
మొలక లిడు వెన్నెలల చెలువము దిగంతముల
     కలముకొని తారకల తళుకులను గప్పన్
గలువపొడి గందవొడి దొలక సుడిరేగుచును
     మెలగు నెల పయ్యరలు నలసత జరింపం,
దలపున రసార్ద్రమగు వలపు లిగిరింప దిన
     కలకల మడంచి నిశ గొలిపె ప్రమదంబున్‌.
 
స్నానమొనరించి, వెన్నెల చలువ బయల
బిడ్డలున్నీవు నిల్లాలు ప్రీతి గుడిచి,
పొడుపు కతలు, సమస్యలు, బూర్వచరిత
లంత వచియింపు వారలు సంతసింప.

శ్రమ, విషాదమ్ము, లాసలు, సర్వకాల
హృదయ భేదక చింతలు, నిదుర యనెడు