పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
233

మహితతాంబూలాది మర్యాదలన్ బహు
          గంధచర్చలమెప్పు గల్గఁజేసె
విశ్వనాధసమాఖ్య వెలయు విద్వాంసుఁ డా
          త్మానందముం దెల్పునట్లుచేసె

వీరభద్రాఖ్యుఁడౌ మేటి ఫేషుకారు
అలకఱా సూర్యనారాయణాద్యలఘులు
ధర్మలింగాదిఘనులుఁ జంద్రయముఖ సర
సులును నుతిసల్ప సభ ముదంబొలయఁ జేసె

బాలభానుప్రభా భాసమానములుశ
          రచ్చంద్రచంద్రికారాజితంబు
లపరదిగ్‌వ్యాప్త సంధ్యారాగ రమ్యముల్
          క్షీరడిండీర రుచిప్రధితము
లబ్జరాగమణి ఘృణ్యౌఘ సంశ్లాఘ్యముల్
         వజ్రమణిద్యుతివర్ణితంబు
లంగారకగ్రహాభంగఘృణాకృతుల్
         కర్బురగురువరాకారయుతము

లగుచుఁ గలధౌతపు మొలాము లమరునరిది
సాలువులఁజేలముల నిచ్చిస్వాంతమలర
రెండునూటపదాఱు లర్పించె సభను
శ్రేష్ఠ వేంకటరామ నృసింహవిభుఁడు

పూర్వరసికప్రభూత్తముల్ పూర్వసుకవి
వరులు మీరలు మమ్మెట్టి తెఱఁగు లమర
గౌరవింతురొ, యట్లే తా గౌరవించె
నశ్వరాట్పురి నారసింహప్రభుండు