పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

మచ్చరిత్రంబు సమ్యగ్రీతి నెఱిఁగించు
          పత్త్రికాభివ్యాప్తి పరఁగకుండ
మార్గశ్రమలకోర్చి మాదృశుల్ తత్పురం
          బునకెన్నఁడేనియు జనకయుంట
ఆజ్ఞసుగ్రీవాజ్ఞయగుట నెఱింగిన
          వారేనియుం దెల్పనేరకుంట
కాంచికావిభుని రంగస్వామిదర్శించు
          కార్యవేగంబాత్మఁ గ్రమ్మియుంట

సరసమణి దానశాలి రసజ్జమౌళి
యైనఁగాని సభాయత్న మాపిమమ్ము
నుచితసత్కారములఁబంప నూహఁజేసెఁ
జిత్తమరయక శ్రీనారసింహవిభుఁడు

మావిషయంబు గార్యవిధి మానవనాయక నీదుపంపుఁబ
ద్యావళివ్రాసిపంప ముదమంది మహాసరసాగ్రయాయి యా
భూవరుఁడప్పుడేపిలువఁబుచ్చి నమస్కృతిపూర్వకోక్తి సం
భావనమొప్పఁ గూరిచిన మన్నన లార్యనుతంబులై తగున్

మముగన్నదాది యా భూ
రమణుఁడు నిజబంధులట్ల రాగము పేర్మిన్
మమువీడక దినము నీమే
షముగతి వెడలించు హృద్యసంభాషలచేన్

సముచితాభ్యంగ మజ్జనవిధానముల న
          నూనానుమోదంబు నొందఁజేసె
ననుపమానేక భక్ష్యాహారముల నుపా
          హారంబులం దృప్తినందఁజేసె