పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

163

మత్సహోదరుఁడగు బుచ్చిరామకవిని గుఱించిన ప్రసంగమునుబట్టి పంగిడిగూడెములోఁ జెప్పినవి

ప్రకటప్రజ్ఞశతావధానములొనర్పంగా, మహాశుప్రబం
ధకవిత్వంబునఁబండితస్తుతులనొందంగాఁ దగెన్‌బుచ్చిరా
మకవిఖ్యాతుఁడుమత్సహోదరుఁడు క్షేమస్పూర్తిమై గేహర
క్షకునేఁడుండెను ధామసీమ నయవాసా! బాలకృష్ణాహ్వయా!

శతావధాన సభాంతమునఁజెప్పినవి

అరుదౌ ఠీవి శతావధానమును జేయం జేసి, నాగావనీ
శ్వరునిన్, సభ్యుల మెచ్చఁజేసి, మము నుత్సాహాడ్యులంజేయు నీ
కరుణాపూర్ణత కే మొసంగుట నమస్కారంబులే, కాన, స
త్కరుణాదృష్టుల మన్నమస్కృతులివే గైకొమ్ము సర్వేశ్వరీ!

తమరిడ్డ ప్రశ్నముల్ తగఁబూర్తియగుట సం
         స్తవమాచరించు పృచ్ఛక గణంబుఁ
గోరిన కోర్కి సేకూరుట కతితర
         ప్రమదమందెడు రాజబంధు వితతిఁ
బద్య గద్య శ్రేణి భావముల్ దెలియఁ బ్ర
         శంసించినట్టి రసజ్ఞ వరులఁ
దనమహాస్థానమే తాదృశోన్నతి గాంచు
         టారసి ముదమందు నధిపవర్యు

స్త్రీ ప్రతానంబుతో శ్రద్ధఁజేరి, కాంచి
మోద మిగురొత్త నాత్మలో మురియు రాజ్ఞి
నిష్ట సిద్ధులు దయచేసి యేలుమెపుడు
ఘన దయాస్థాని! భర్మదుర్గా భవాని!