పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
162

అరయన్ గంటకునైదునూఱులగుపద్యంబుల్‌జగచ్చోద్యధీ
గరిమంజెప్పి యసామ్యులీకవివరుల్ కాళీకృపాసిద్ధు లీ
శ్వరలీలామహిమంబుఁజూపజగతిన్ జన్మించిరంచున్‌గవీ
శ్వరచూడామణులేనుతించిన మిమున్ శక్యంబె నాకెన్నఁగన్

ఓ నాగభూప! మాకీ
యానందముఁగల్గజేయు నాఢ్యునకును నీ
కానందనందనుఁడు లో
కానందదుఁడిచ్చునాత్మజానందంబున్

ఇట్లు,

పసుమర్తి కామన్నశాస్త్రి

రౌద్రి సంవత్సర పుష్య శుద్ధ౧ నాఁడు మఱికొన్ని గ్రామముల వారాహ్వానించినప్పుడు ప్రయాణ సందర్భములోఁజెప్పినవి

సర్వకుటుంబభారముఁ బ్రశస్తతరార్హతమ క్రియావళిన్ ధూర్వహుఁడైనవాఁడనుఁగుఁదోడుగృహంబుననుండితీర్పమే
మిర్వుర మీ ప్రయాణము నభీష్ట శుభప్రతిపాదకంబుగా
నిర్వహణంబొనర్చితిమి నేఁటికి నీకృపనో మహేశ్వరీ!

చలివ్రేఁగయ్యె ధనాదిగౌరవ విశేషప్రీతులంగూర్చునా
ప్తులవీడన్‌మనసొప్పదయ్యె జననీపుత్రాదులంజూచుచూ
పులు మెండయ్యెఁబితృప్రయోజనదినంబుంజేరరానయ్యె మే
లొలయన్నేఁటికనుజ్ఞయీయఁగదెమాకోరెడ్డిసీమేందిరా!

మీగురులెవ్వరను ప్రశ్నమునకుఁ బ్రత్యుత్తరము

అనఘజయంతి రామవిబుధాగ్రణి సర్వసుఖంబులొందఁజే
య, నమరభాషనేర్పినమహాత్ముని రామడుగన్వయాబ్ది చం
ద్రుని గురురామకృష్ణ బుధధూర్జటినెంచుచుఁదత్కటాక్షసి
ద్ధినిఁదగువిద్య పేర్మిజగతింజరియింతుము వీరయాహ్వయా!