పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72


గుంటూరు శతావధానము

(01-10-1911)

గురుస్తుతి

   రామడుగు రామకృష్ణ సు
   ధీమణినిన్ సంస్మరింతు దేశికవర్యున్
   శ్రీమహితుఁ బోత రాట్కుల
   రామకవిన్ దలఁతు సుగురురత్నము ననఘున్

   శ్రీరమణీయులైనృపులు చేరిరి, సత్కవిరాజరాజులున్
   జేరిరి, పండితోత్తములుఁజేరిరి, సజ్జను లన్యులెందఱో
   చేరిరి, విఘ్నమిందొకటి సేరకయుండఁగజూచి నేఁటి గుం
   టూరి శతావధానసభ నొప్పుగ బ్రోవఁగదమ్మ శాంభవీ


1. అడవిలో దొంగలు తండ్రిని జంప నావృత్తాంతము మూఁగ
   యితరునకుఁ దెలియఁజేయుట - భుజంగప్రయాతము

   వనంబందునం దొంగవాండ్రుగ్రులై తం
   డ్రినింజంప దుఃఖంబు వ్రేగౌటచే న