పుట:Kokkookamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్లో.

పుటదగ్ధపద్మినీదళభల్లాతకబాలకృష్ణలవణానామ్।
భూత్యా పరిణతబృహతీఫలరసపరిపిష్టయా భవతి॥


శ్లో.

మహిషీమలేన మిళితం లింగం పశ్చాదనేకశో లిప్తమ్।
ముసలమివ మదనవిహ్వలయువతీజనదర్పనిర్దళనమ్॥


శ్లో.

సింహీఫలభల్లాతకనళినీదళసిన్ధుజన్మశైవాలైః।
మాహిషనవనీతేన చ కరంబితైః సప్తదినముషితైః॥


శ్లో.

మూలం హయగన్ధాయా మాహిషమలమిళితపూర్వమాలిప్తమ్।
భవతి లఘూకృతగర్దభలింగం లింగం ధ్రువం పుంసామ్॥


సీ.

పద్మదళంబులు భల్లాతకంబులు
                 నువ్వులు పిప్పళ్ళు నూరి కడవఁ
బెట్టి యగ్నిపుటంబు పెట్టి బృహస్పతీ
                 రసముతో నొక్కకరాటమునను
మహిషీమలంబును మఱిగూర్చి పూయ ఘో
                 టకలింగ మటుల దండంబు పెరుఁగు
ములకపండును హరిదళము జీడియుఁ గాచు
                 సైంధవలవణంబు సరవిఁ దెచ్చి


ఆ.

యెనుము నేతితోడఁ నెనయంగ మర్దించి
దినములేడు బరణి నునిచిపుచ్చి
బఱ్ఱెపేడ నీటఁ బరఁగంగఁ బెన్నేరు
గలిపి పూయ కామబలము నిచ్చు.


తా.

తామరరేకులు, జీడిగింజలు, నువ్వులు, పిప్పళ్లు యివి నూరి యొక
కుండలో బెట్ టిదానిపై మూకుడు బోర్లించి చీలమన్నుంచి పుటము బెట్టగా
వచ్చినభస్మమును బృహస్పతీఫలరసముతోడ మర్దించి గేదెపేడతో కలిపి లింగము
నకు బూసికొనిన గుఱ్ఱముయొక్క లింగమువలె వృద్ధి చెందును. మఱియు ములక
పండు, హరిదళము, జీడిగింజలు, కాచు, సైంధవలవణము, ఇవి గేదెనేయితో
మర్దించి యేడుదినము లొకబరణియం దుంచి తరువాత గేదెపేడను గలిపిననీటిలోను
పెన్నేరుగడ్డరసములోను కలిపి లింగమునకు బూసిన దండము వృద్ధి చెందును.