పుట:Kokkookamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనువున సితకుసుమంబులు మంత్రించి
                 యనుపుడు ప్రణవకృష్ణాక్షి కృష్ణ


గీ.

ముఖియుఁ గృష్ణాంగియును నన్యముఖపదములు
పరఁగ పుష్పంబు దాస్యామి పరమవశ్య
వశ్యవశమానయది నభవతియదాది
బ్రహ్మరుద్రాదిభవతి నాఁ బరఁగె మనువు.


తా.

పీనుగతలయందుంచిన పువ్వులు, నెమలియెముక, పొన్నంగిపిట్ట
యెముక సుడిగాలి యందుతిరిగిన యెండుటాకు, ఈనాలుగువస్తువులు చూర్ణము
చేసి యాచూర్ణమును పురుషులు స్త్రీల తలలయందును స్త్రీలు పురుషుల పాద
ములయందును పూయగా వశులగుదురు. మరియు "ఓం కృష్ణాక్షీ కృష్ణముఖీ
కృష్ణసర్వాంగీ యస్యహస్తే పుష్పం దాస్యామి తమవశ్యం వశమానయ యది
నభవతి తదా బ్రహ్మహో రుద్రోభవతి స్వాహా" ఇది కృష్ణాక్షి మంత్రము. ఈమం
త్రిమువలన తెల్లనిపువ్వులు మంత్రించి స్త్రీకి యిచ్చిన వశ మగును.


శ్లో.

శంభుః శక్త్యారూఢః కుండలినీమండితోథ బిన్దుయుతః।
అష్టావింశతివారం వశయతి రామాం రతే జప్తాః॥


శా.

ఓంకారంబును మాయఁగూర్చి సుమతిన్ యోజింతు సత్కుండలీ
న్యంకంబై ధర నుత్తమం బగు జపం బష్టోత్తరంబౌశతిన్
సంకల్పాదిగఁ జేయ వశ్యమగు రాజద్రాజబింబాస్య దా
వంక న్ముక్కునవ్రేళ్ళు మారుతముతో వర్తింపఁ జేయందగున్.


తా.

"ఓం, హ్రీం. నమః పురస్కృత్యకంభవే” ఇదికుండలినీమంత్రము.
ఈ మంత్రము తన యెడమముక్కునుండి గాలి బయటకు వెళ్ళుసమయమున ఇరు
వదియెనిమిదిమార్లు జపించిన వశ మగును.


శ్లో.

మదనాతపత్రవదనే స్ఫటికాకారం వకారమనుచిన్త్య।
ధ్యాతం ధ్వజోగ్నిబీజం వశయతి రామాం రతే జప్తః॥


క.

మదనగృహద్వారంబునఁ
గదియ వకారంబుఁ దలఁచి కామాగ్రమునన్
విదిత రకారము దలఁచుచు
సుదతిన్ రమియింప ద్రవముఁ జూపున్ వలచున్.