పుట:Kokkookamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాదయుతంబౌ మంత్రము
నాదిగ సప్తాక్షరాఖ్యమై విలసిల్లెన్.


ఆ.

నేల తాటిగడ్డ నెలయంగ గోరోజ
నమునఁ గన్యచేత నలియనూరి
యదియు నియ్య దాని నభిమంత్రణముఁ జేసి
తల నునిచిన పతులకులము మెచ్చు.


తా.

"ఓం, క్రోం, హ్రీం, శ్రీం, ఢం, స్వాహా” ఇది సప్తాక్షరీమం
త్రము. ఈమంత్రమును జపించుచు నేలతాడిగడ్డయును గోరోజనమును కన్యచే
నూరించి యామందును స్త్రీలకు యిచ్చినను లేక తలమీద పులిమినను వశులగుదురు.


శ్లో.

ఓం చాముండే జయ జంభే మోహయ వశమానయాముకీం స్వాహా।
అభిమన్త్య పుష్పదానాత్ ప్రణవాదిరయం వశీకరణః॥


గీ.

ప్రణవచాముండజయజృంభపదము మోహ
యవశమానయాముకీంస్వాహా యటంచు
మంత్రితము చేసి పువ్వులు మగువ కనుప
వశ్య మగుఁ జూడ నెటువంటి వనితయైన.


తా.

"ఓం చాముండే జయ జంభే మోహయ వశమానయ అముకీం
స్వాహా” ఇది మోహనమంత్రము. ఈ మంత్రమువలన పువ్వులను మంత్రించి స్త్రీకి
పంపిన నాస్త్రీ వశమగును.


శ్లో.

శవశిరసి స్థితమాల్యం జీవంజీవకమయూరయోరస్థి।
సద్యకరేణ గృహీతం హిత్యావర్తోత్థీతం పత్త్రమ్॥


శ్లో.

చూర్ణం వికీర్ణమేషాం వశయతి నారీనరౌ శిరఃపదయోః।
దత్తం ధవళం కుసుమం కృష్ణాక్షీత్యాదిమన్త్రేణ॥


సీ.

పీనుఁగుతలయందుఁ బెట్టినపువ్వులు
                 నమిలియెముకయుఁ బొన్నంగిముడుసు
సుడిఁగొన్నగాలిలోఁ జడితూలు నాకును
                 గూడఁ జూర్ణము జేసి కొమ్మతలను
బురుషునిపదములఁ బొందింప వశ్యుల్
                 యలరుదు రిఁకను గృష్ణాక్షి యనెడు