పుట:Kokkookamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరమపావని కాదె భాగీరథీదేవి
                 శంతనుతో రతి సల్పుకొనియె


గీ.

ద్రౌపదీకాంత కేవురు ధవులు కారె
గొల్లెతలు కృష్ణుతో నొనఁగూడి మనరె
కానఁ దొల్లిటివారును గవిసినారు
జారుఁ బొందిన నేమి దోషంబు సతికి.


తా.

ఆహల్య యింద్రుని పొందలేదా, తార చంద్రునితో కలియలేదా?
యోజనగంధియగు దాశరాజు కుమార్తె పరాశరుడను మునిని పొందలేదా? పరమ
పవిత్రమగు గంగ శంతనుని పొందలేదా? ద్రౌపతికి యైదుగురు మగలుగదా?
గోపికలు కృష్ణునితో సుఖింపలేదా? పూర్వకాలపువారగు యట్టిమహనీయులే
పరదారాగమనంబు దోషంబులేదని కూడినపుడు మనకుమాత్ర మేమిదోషము
గలదని తెల్పును.


శ్లో.

నిఃశ్వసతి జృంభతే వా స్వవిత్తమస్యై దదాతికించిద్వా।
యాన్తీమేష్యసి పునరితి పదతి, కథం సాధువాదినీ భవతీ॥


శ్లో.

సక్తి కిమప్యసమంజసమిత్యుక్త్వా తత్కథా భజతి।
కిన్న కరోమి వచస్తవ కిన్తు శఠో౽సావతీప మే భర్తా॥


శ్లో.

హనతి చ తస్య వికారం శ్రుత్వా భూయస్తు సోపహాసేవ।
ఇత్యాకారప్రకటనమాలోక్య ప్రాభృతం యుంజ్యాత్॥


వ.

ఆదూతి తెల్పుమాటలను వినినతరువాత యాపె నిట్టూర్పులు విడుచును.
దూతికిఁ గొంచెము లంచమిడును. తనయొద్దనుండి వెడలుదానిని మరల వెనుకకుఁ
బిలుచును. ఇంకొకమాటయని మరల మరల వెనుఁద్రిప్పును. నీవ ని ట్లగునా యని
మరల ప్రశ్నించును, దూతి చెప్పుదానిలోఁ గాఁగూడనిదేమో యున్నదనుచు
నాయకవృత్తమును మరల వినఁగోరును, నీ వన్న ట్లేమి చేయను నాపెనిమిటి మిక్కిలి
కోపి యాయె ననును, తద్భర్తృకోపస్వభావాదిప్రకటన మాలకించి దూతిక నవ్వి
తానును నట్లే యన్నదై యామాటవలన నాయింతి మనోగతమును గుర్తించి యుపా
యనదానాదికము నుద్భోదించును.


శ్లో.

తాంబూలకుసుమలేపనదానై రుపబృంహయేద్భూయః।
ఇతి సుఘటితసద్భావా వ్యసనవివాహోత్సవప్రాయే॥