పుట:Kokkookamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

ఎల్లప్పుడును వాకిట నిలుచుటయు, యేడ్చుటయు, కోపము గలిగి
యుండుటయు, నిదుర గలిగియుండుటయు, చెప్పుమాటలను వినక ఆవులించుటయు
నీగుణములుగల కన్నియ పెండ్లి చేసుకొన తగదని మునీంద్రులు చెప్పిరి.


శ్లో.

గిరితరుతటినీనాం నామభిః పక్షిణాం వా
                        సమధికపరిహీనా వ్యానతక్రూరగాత్రీ।
అధరమధికలంబం కోటరం పింగళం వా
                        నయనమథ పహన్తీ కర్కశం పాణిపాదమ్॥


సీ.

పర్వతతరునదిపక్షినామంబుల
                 నేకన్యఁ బిలుతు రయ్యింటివారు
పొడవు కొంచెము దళంబును నల్పమును గాఁగఁ
                 దనరు నేకన్య వక్త్రమును దొడలు
పెదవియు నధికంబు పింగళమై గుంట
                 కన్నులు గలిగి యేకన్య మెలఁగు
కరతలంబులు పాదకమలంబులును గడు
                 కఠినంబు లగుచు నేకన్య యొప్పు


గీ.

నిదురఁబోవుచు నవ్వెడి నిడుదయూర్పుఁ
బుచ్చు నేడ్చెడి నేకన్య భుక్తివేళ
మీసములు గల్గి చనుదోయిమీఁద రోమ
ములును గల్గిన కన్నియఁ దలఁపవలదు.


తా.

కొండయు చెట్టును నదియు పక్షియు వీటిపేరులును, కొంచెము
పొడవగుమొగమును, కొంచము మందముగల తొడలును, పెద్దపెదవియు, గోరో
జనమువంటి వర్ణము గలిగిన గుంటకన్నులును, కఠినములయిన కాళ్ళుచేతులును,
నిదురబోవుచు నేడ్చునదియు, భోజనసమయమందు నిట్టూర్పల విడుచుచు నేడ్చె
డిదియు, మీసములు గలిగినదియు, చన్నులపై వెండ్రుకలును గలిగిన కన్యల వివా
హమునకు దగనివారు.


శ్లో.

శ్వసితి హసతి రోదిత్యేవ యా భోజనేసి
                        స్తనమపి పతితోర్థ్వం బిభ్రతీ శ్మశ్రులా వా।