ఈ పుట ఆమోదించబడ్డది
మాతృమందిరము.
[మాతృమందిర సందర్శన తత్పరులైన కొందఱు యాత్రికులు, కొండ నెత్తమున వొకనాఁటి రేయి గడపి, ప్రొద్దుపొడుపున మేల్కొందురు. కను చూపుదూరమున వారికి మాతృమందిరము కనుపట్టును.]
మొదటి యాత్రికుఁడు
అవనీధరంబుపై ననిల డోలికల
నల్లనల్లన నూఁగు నంబుదార్భకులు
బంగారుకలలలోఁ బడి చిక్కుకొనిరి.
మంచుముత్తెపుఁ దెరలు చించి తొలఁగించి
పడకింటి కిటికీని బాగుగాఁ దెరచి
నవ వధూతిలకంబు నాఁ దొంగిచూచు
దిన రమామణి తూర్పు తీరంబు నందు,
రెండవ యాత్రికుఁడు
విరిసెడి క్రొంబూల వింత నెత్తావి,
చుట్టుపట్టుల నున్న సొగసైన గిరులు,
కర్ణ పేయంబైన ఖగపాళి రుతము,
ఆనందజనకమై యలరు నిచ్చోట!
7