ఈ పుట ఆమోదించబడ్డది
98
కవికోకిల గ్రంథావళి
[నైవే
మూడవ యాత్రికుఁడు
మాతృమందిరమున మంగళధ్వనులు,
బంగారు గంటలు పలికించు రవము,
శంఖ నినాదంబు, సామగానంబు
నాలకింపుఁడు! కాలహరణంబు తగదు.
నాల్గవ యాత్రికుఁడు
అమలసౌరభ మీను నగరు ధూపంబు
కర్పూరఖండంబు గనిపించు త్యాగ
మాత్మలో వెలిఁగించు నమృతదీపంబు!
ఐదవ యాత్రికుఁడు
అల్లదే! సోదర యాత్రికులార,
పర్వతశిఖరంబుపై మాతృమంది
రంబు సూర్యాంశుల రమణీయమగుచు
మణిమయ మకుటంబు మాదిరిఁ దోఁచు;
పూజసల్పఁగ ఫల పుష్ప చయంబు
దోసిళ్ళఁ గొనితెచ్చి త్రోవపట్టుదము.
మందిర మార్గంబు మహితవృక్షముల
నీడలఁ జల్లగా నిదురించుచుండు.