పుట:Kavijeevithamulu.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

602

కవి జీవితములు.

ఇట్లుగా సింగన తాను భాగవతకథ నాంధ్రీకరించుటకుఁ గారణంబులు వాక్రుచ్చె. ఇతఁడు ప్రాచీనాంధ్రకవులను వర్ణించుచో నన్నయభట్టును, తిక్కన సోమయాజులను ఎఱ్ఱప్రెగ్గడను, భాస్కరుని నాచనసోముని, శ్రీనాథుని వర్ణనజేసి పోతనామాత్యు నీక్రిందివిధంబున నుతియించె.

"ఉ. ఎమ్మెలు సెప్ప నేల జగ మెన్నఁగ పన్నగ రాజశాయికిన్
      సొమ్ముగ వాక్యసంపదలు సూరలు సేసినవాని భక్తి లో
      నమ్మినవాని భాగవత నైష్ఠికుఁ డై తగువానిఁ బేర్మితో
      బమ్మెరపోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్."

అని నుతియించుట జేసి యితఁ డీగ్రంథంబు రచియించుటకుఁ బూర్వమే పోతన భాగవతనిష్ఠ నున్నట్లుగా నూహింప నై యున్నది. ఈసింగన పోతనామాత్యుని విధంబున తనకృతిముఖమంతయు నమర్చుటం జేసి యితఁ డాతనిశిష్యుం డగునేమో యని తోఁచుచుండును. ఇతని కృతిముఖంబున పోతనవలెనే శ్రీకృష్ణవర్ణనయు ననంతర పద్యములో శివవర్ణనయు, పిమ్మట బ్రహ్మకు వందనమును దరువాత విఘ్నేశ్వరవర్ణనయు సరస్వతీస్తుతియును, అనంతరము లక్ష్మీస్తుతియు నున్నది. షష్టస్కంధములోను ప్రథమస్కంధములోవలెనే శ్రీకృష్ణునకు షష్ఠ్యంతములు వాయ౦బడినవి. దీనిం జూడ నీతండు భాగవత మారంభమైన కొన్ని దినములకు గ్రంథారంభంబు చేసి తన గ్రంథారంభముకూడ పోతనగంథమువలెనే యుండఁగోరి యటులనే దాని నంతయు రచియించినట్లు మాత్రము గాన్పించును. ఇంతకంటె నీగ్రంథమునుబట్టి వ్రాయఁదగినది కాన్పించదు, ఇతఁడును షష్ఠస్కంధము చివరను శ్రీరామాంకితము గానే ముగించి చెప్పెను. దీనికి పోతనవలే ముగించెద ననుతాత్పర్యముతప్ప వేఱే కాన్పించదు.

వెలిగందల నారాయణకవి వంశముంగూర్చి

ఇతనిం గుఱించిన కథాసందర్భము లేమియు విస్పష్టము కాలేదు. పైని మనము నిర్ణయించిన ప్రకారము వెలిగందల అనునామము