590
కవి జీవితములు.
దొరికినవఱ కిందుఁ గాన్పించు. తక్కుంగలపురాణకవులపేరులు వివరించి యేవఱకు వారిచరిత్రములు ప్రసిద్ధములో తెల్పి వాని నుచితస్థలంబున వివరించెదను.
పై ప్రసిద్ధపురాణకవుల మువ్వురిలో భాగవత గ్రంథకవి యగు బెమ్మెరపోతరాజుచారిత్రము ప్రథమములోఁ బ్రారంభింపఁబడుచున్నది.
ఈపోతనామాత్యుఁడు నియోగిబ్రాహ్మణుఁడు. కౌండిన్యగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. ఇంటిపేరు బమ్మెరవారు. తండ్రిపేరు కేసన్న. తల్లిపేరు లక్కాంబిక. ఈ కవి తనవంశావళి నీక్రింది పద్యములలో స్పష్టపఱిచెను. ఎట్లన్నను :-
"సీ. కౌండిన్యగోత్రసంకలితుఁ డాపస్తంబ, సూత్రుండు పుణ్యుండు సుభగుఁ డైన
భీమనమంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ, కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తువరమునఁ గనియె సోమనమంత్రి, వల్లభ మల్లమ వారితనయుఁ
డెల్లన యతనికి నిల్లాలు మాచమ, వారిపుత్రుఁడు వంశవర్ధనుండు
లలితమూర్తి బహుకళావేది కేసన, దానమాననీతిధనుఁడు ఘనుఁడు
తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతము గనియె."
ఇట్లు చెప్పి తనతల్లి యగులక్కమగుణములను వర్ణించి యొకటి రెండు పద్యములు చెప్పె. అం దొకటి మనము వివరింపఁదగియుండును. ఎట్లన్నను :-
"ఉ. మానిను లీడు గారు బహుమాననివారిత దీనమానస
గ్లానికి దానధర్మమతిగౌరవమంజులతాగభీరతా
స్థానికి ముద్దుసానికి సదాశివపాదయుగార్చనానుకం
పానయవాగ్భవానికిని బమ్మెరకేసయ లక్కసానికిన్."
అని తనతల్లిదండ్రుల వర్ణించి
"క. అమిథునమునకుఁ బుట్టితి, మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వరసేవా
కాముఁడు దిప్పయ పోతయ, నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్."
అని తనవంశావళిని తనవఱకే చెప్పి ముగించెను అప్పటి కీతనికిం గుమారు లున్నట్లు తోఁచదు. దీనింబట్టి యితనివంశవృక్షము ప్రస్తరించెదను.