పుట:Kavijeevithamulu.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

472

కవి జీవితములు.

   నచటిమేటికిరాటు లలకాధిపతి నైన, మును సంచి మొద లిచ్చి మనుప దక్షు
   లచటినాలవజాతి హలముఖాంత విభూతి, నాదిభిక్షువుభైక్ష మైన మాన్చు
   నచటివెలయాండ్రు రంభాదు లైన నొరయఁ, గాసెకొంగున వారించి గడపఁగలరు
   నాట్యరేఖాకళాధురంధరనిరూడి, నచటఁ బుట్టినచిగురుఁగొమ్మైనఁ జేచ."

కవికర్ణ రసాయనములో బైని సంగ్రహముగా వర్ణింపఁబడిన పట్టణాంగములు విపులములుగాఁ జేసి వర్ణింపఁబడియె. అందలిపద్యము లన్నియు వివరించుట గ్రంథవిస్తర మగుటయుఁ, జారిత్రోపయోగము కాకుండుటయు నగును గావున నందులవివరముమాత్రము తెలిపి చమత్కారము లగు నొకటి రెండుపద్యములు వివరించెదను. ఎట్లన్నను.

పురవర్ణముతోఁ జేర్చి 1. పట్టణముపై సంచరించు సూర్యచంద్రులను, 2. నక్షత్రములను, 3. బ్రహ్మక్షత్త్రియ వైశ్యశూద్రులను, 4 పట్టణముననుండు వారణములను 5. ఉత్తమాశ్వములను, 6. క్రీడామందిరములను, 7. తన్మందిరవిహారులను, 8. వార యువతులను, 9. పుష్పలావికాజనమును; 10. ఉద్యానవనములను; 11. సరస్సులను, 12. కోడె గాండ్రను చెప్పెను.

ఇట్లుగా వర్ణించిన నరసింహకవియొక్కయు పెద్దనార్యునియొక్కయు దృష్టిలోఁ బుర మెట్లుగా నున్నదో అందు వర్ణింపవలసిన వర్ణనలు పెద్దనార్యునివలన నెన్ని వదలివేయంబడియేనో చూడవలయును. పెద్దనార్యుఁ డొక సీసపద్యములోఁ జెప్పిన పైవర్ణనలను నృసింహకవి యిరువదిపద్యములతో నతిప్రౌఢముగా వర్ణించి చెప్పెను. అట్టి వర్ణనలలోఁ బుష్పలావికావర్ణన, సరోవరవర్ణనల పద్యముల నిట వివరించెదను. ఎట్లన్నను :-

పుష్పలావికలు.

సీ. కరములకందిచ్చు విరులబంతులకంటె, వెడఁ దోఁచుచన్నులు వేడ్కఁ బెనుప
    మవ్వంబుఁ గొననెత్తుపువ్వుటెత్తులకంటెఁ, గరమూలరుచి చుడ్కిగమిచితిగువ
    కోరిన నొసఁగెడుకొసరుపువ్వులకంటె, మొలకనవ్వులు డెందములు గరంప
    నిండారునెలవులనెత్తావిగమికంటె, సుముఖసౌరభములు చొక్కుబెనుప