పుట:Kavijeevithamulu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

కవి జీవితములు

మువాఁ డైనందున నతనిరాజ్యకాలము 1564 సంవత్సరమునకు లోపల నారంభ మైయుండును. కాఁబట్టి పింగళి సూరన్న నంద్యాల సంస్థానమునం దుండి కృష్ణరాజునకుఁ గళాపూర్ణోదయము నంకితము చేసినకాల మించు మించుగా 1560 సవత్సరప్రాంత మని చెప్పవచ్చును. లలో సింహాసనము నెక్కినరాజైనం గావచ్చును. రాజు కాకపూర్వము కృతి నందఁ గూడ దమని బంధన లేనిచో నంతకుఁ బూర్వమే కృష్ణరాయ లీకళాపూర్ణోదయ కృతి నందియుండవచ్చు ననునూహ నది యెట్లు బాధించఁగలదు? కాఁబట్టి నంద్యాల కృష్ణంరాజు రాజ్యకాలమునుబట్టి పింగళి సూరనకాల నిర్ణయము చేయఁబడఁ గూడ దని యింకొకసారి చెప్పెదను.
(6) ఈసదాశివరాయఁడు అచ్యుతదేవరాయనికుమారుఁ డైనట్లు కొన్ని శిలా తామ్రశాసనముల యందుఁ జెప్పఁబడియున్నది కాని కృష్ణామండలములోని సత్తెనపల్లితాలూకాలో దొరకిన శా. స. 1482 సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1560 సంవత్సరపు తామ్రశాసనములో నతఁడు రంగరాజునకు తిమ్మాంబకు పుత్త్రుఁడై నట్లును రామరాజునకు మఱఁది యైనట్లు నున్నది. (6) ఇం దుదాహరింపఁబడినశిలాశాసనము కృష్ణామండలములోనిదిదియై కన్నడరాజ్యములో దొరకిన యనేకాశిలా తామ్రశాసనములఁ బూర్వ పక్షముసేయు నదియై యున్నది. కాఁబట్టి కన్నడరాజులు ఆరాజ్యములో నిచ్చిన శాసనములు యథార్థములుగాని ఈసత్తెనపల్లితామ్రశాసనమును నమ్మఁగూడదు. విజయనగర రాష్ట్రచారిత్రములోఁ గాలనిర్ణయములోఁ గల్గినచిక్కు లిక్కడఁ జెప్పుట యప్రస్తుతము గనుకను, ఈసంవాదము సూరకవికాలనిర్ణయమునకు నిరుపయోగము గనుకను సమాధానము వ్రాయమానెదను.