పుట:Kavijeevithamulu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

305

(4) ఈకృష్ణదేవరాయల యనంతరము 1530 సంవత్సరమున రాజ్యమునకు వచ్చినయచ్యుత దేవరాయలు 1542 సంవత్సరమున మృతి నొందెను. ఆకాలమునందు సదాశివ దేవరాయలు బాలుఁ డౌటచేత రామరా జతనిని సింహాసన మెక్కించి రామరాజు 1564 సంవత్సరమున మృతినొందెను. సదాశివరాయఁడు 1567 సంవత్సరమున మృతుఁడయ్యె. ఆసంవత్సరమునందే తిరుమల దేవరాయఁడు విజయనగరమును విడిచి పెనుగొండఁజేరి 1569 లో పెనుగొండరాజ్యము స్థిరపర్చి 1572 సం. మునందు లోకాంతరగతుఁ డయ్యెను. 1572 సంవత్సరమున నతని పుత్త్రుఁడైన శ్రీరంగరాజు రాజ్యమునకు వచ్చి 1585 సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. 1585 సంవత్సరమున నాతని తమ్ముఁడు వేంకటపతి రాజు సింహాసనమునకు వచ్చి తనరాజధాని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చెను. 1614 సంవత్సరములో సంతానము లేనివాఁడై మరణము నొందెను. (4) దీనిలోనిసంగతులు చూడనందుఁ గలకృష్ణరాయఁడు సదాశివదేవరాయలు విజయనగరమును పాలించుసమయములో నున్నాఁ డని చూపించుటకై చాలియున్నవి. కాని విజయనగరరాజులజనన మరణకాలములం దెల్పుటకుఁ గాదు. పైకధలోఁ దెల్పఁబడినకాలనిర్ణయము న్యూయల్‌దొరగ్రంథములోని కాలనిర్ణయ పట్టికలకు మిక్కిలి సరిపడి యుండలేదు. అట్టి దానిం గూర్చి ప్రస్తుతము మనము సంవాదింపఁ బనిలేదు. కావున నేనిపుడు సిద్ధాంతమునకు సమాధానము చెప్ప విడిచెదను. ఇవి యన్నియు యథార్థములే యనుకొన్నను అవి సూరకవికాలమును నిర్ణయింపం జాల వని మాత్రము విస్పష్టముగాఁ జెప్పవలసియున్నది.
(5) నంద్యాలరా జైనకృష్ణమరాజు సదాశివదేవరాయని కాల (5) నంద్యాల రాజైనకృష్ణమరాజు సదాశివరాయలు వీరికాలము