పుట:Kavijeevithamulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

కవి జీవితములు



తాను డిగి చెచ్చెర సింహాసనంబుపైకిఁ జని యం దున్న పరరాజు శిరంబు నఱికి యాతనియట్టఁ గ్రిందికిఁ ద్రోచి తనపరివారంబుం బిలిచి సేనలసన్నాహంబు సేయు మనుఁడు వారందఱునుఁ దమరాజు చిరకాలమునకు వచ్చుట కెంతయు సంతసించి యుద్ధసన్నద్ధులై పరరాష్ట్రసైన్యము నుక్కడంచి మిగిలినవారిం బాఱఁదోలిరి. ఇట్లు రాజకళింగగంగు భీమకవివరప్రసాదలబ్ధి సింహాసననాసీనుండై సుఖంబున రాజ్యంబు సేయుచుండెను. అప్పుడు కళింగదేశమునకు సజ్జనగరము ముఖ్యపట్టణ మని తోఁచెడిని. విజయరామమూర్తినృపుఁడు విజయనగరముం గట్టి ముఖ్యపట్టణము చేసినట్టు వాడుక గలదు. ఇక్కడ భీమకవి కళింగగంగును దీవించి యింటికిం జని తనకు నిర్యాణంబు తటస్థించినది కాఁదలంచి తత్సన్నాహంబున నుండెను. ఇట్లుండ నొకనాఁ డాతనిమాత యతనికి నన్నం బొసంగు చుండ నాపెకడుపున మసి యంటుట చూచి భీమకవి తనతల్లిం బిలిచి నీకడుపు మసి యయ్యె ననియెను. ఆమాట విని యాపె తనకుమారునివాక్య మమోఘ మని యెఱింగినదిగనుక "నాయనా ! యెట్లంటి వనుఁడు భీమన తనకుఁ గాలంబు తటస్థించెం గావునఁ దదనుకూలంబుగనే సర్వంబును జరుగుచున్న దని చెప్పెను. ఆమాటలు విని యాయిల్లాలు మిగుల వగల నొందినది. భీమకవియుఁ దా నిర్దేశించినదినంబునాఁటికి గాలవశుం డయ్యెను.

ఈభీమనచేఁ జేయఁబడినమహాకార్యము లనేకములు గలవు. ఇతఁడు లకోటాప్రశ్నంబులఁ జెప్పుటకు నొకగ్రంథంబును వ్రాసి బెజవాడసమీపంబున నుంచెను. అందుఁ బటలంబు లనియు నర్గ బు లనియు భేదంబులు గలవు. మనప్రశ్నము చేరినకాలముంబట్టి గణితముచేసినచో నిన్నవపటలములో నిన్నవసంచికలో నిన్నవపుటలో నుండు నని చెప్పంబడియుండును. ఆపుటలో మన మడిగినప్రశ్నంబులును దానికిం దగునుత్తరంబులు నుండును. ఇది యొకగొప్పయద్భుత వృత్తాంతము. ఇప్పుడు మన మడుగుప్రశ్నంబులును వానియుత్తరంబులును వేయిసంవత్సరములక్రిందట భీమన యూహించి యుంచెను. ఇది యీశ్వరునిచే నయ్యెడు