పుట:Kavijeevithamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

13



వని గాని యొండు గాదు. కావున నిట్టిసంగతి నొనర్చినయాతఁ డీశ్వరవరప్రసాది యని చెప్పుట కేసందియంబును లేదు. ఈగణితమువిషయమై యింక ననేకగ్రంథంబులు రచియించె నని వాడుక గలదు. అం దద్భుతము లింకను గల వందురు.

ఇఁక నీకవిసాహిత్యముంగూర్చి యించుక వ్రాయుదము. ఆకాలములోని వారిసాహిత్య మీతనిసాహితికిం జాల దని వాడుక గలదు. అపుడు రెండర్థములు వచ్చునట్లు పద్యములు చెప్పినవాఁ డీతఁ డొక్కఁ డే యని యనేకులు నిశ్చయించిరి. ఇందులకు దృష్టాంతముగాఁ బింగలి సూరన తనరాఘవ పాండవీయములోఁ జెప్పినపద్యము :-

శా. రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
    కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగు నే నోహో యనం జేయదే
    పాండిత్యంబున నందునుం దెనుఁగుకబ్బం బద్భుతం బండ్రు ద
    క్షుం డెవ్వాఁ డిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.

ఉ. "భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయె కాని యందు నొం
    డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన రటుండ నిమ్ము"

ఈకవి రాఘవపాండవీయ మనుద్య్వర్థికావ్యము పూర్వము రచించె నని వాడుక గలదు. అది యిపుడు ఖిలమయినది. అప్పకవి నన్నయభట్టు దాని నడఁచె నని చెప్పెను. కారణంబు లతనిచేతం జెప్పఁబడినవి యెంతవఱకు నిజమో మన మిపుడు చెప్పఁజాలము. ఇతఁడు విశేషకవి యని శ్రీనాథుడు కాశీఖండములోఁ దన్ను రాజు నుతించి "నీవు భీమనవలెఁ గవిత్వము చెప్పఁగలవు" అనినట్లుగాఁ జెప్పినపద్యము :-

సీ. "వచియింతు వేములవాడభీమన భంగి నుద్దండలీల నొక్కొక్కమాటు"

ఇంక ననేకస్థలంబులలో నీకవిమాహాత్మ్యంబు పేర్కొనఁ బడియె. నన్నయభట్టారకాదులు నీతనివిశేషంబుగా నుతించి చెప్పినపద్యములు నన్నయభట్టుంగూర్చి చెప్పినకథలో వ్రాసియుంటిమి. ఇంతియకాక యీకవి ఛందోవిషయమైనగ్రంథం బొకటి యొనర్చెను దానినే భీమనఛంద మందురు. అది నన్నయభట్టు వ్యాకరణంబునకుఁ బూర్వ