Jump to content

పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరే, ప్రకృతం మత్స్యజీవులు కోడుదగ్గిఱకు రాకపూర్వమే మహ$ ప్రవాహంగా వస్తూవున్న మరకాళ్ళను చూచి భయవడి కాపులు (స్వల్ప సంథ్యాకులు ) వొక పుపాయం చేశారు. జనపనార తీసిన కట్టెలు కోడు వొడ్డున రెండు గజాల పొడుగున కొన్ని మోపులు కట్టి దానిమీద తెల్లటి బట్టలు పరిచి వసంతం చల్లి ఆయుధపాణులై వాట్లదగ్గిర నిల్చివున్నారు. ఆ సమయానికి చిదపచిదప చీకటి తోడ్పడి మఱకాళ్ళు ఆ జనపనార క ఫ్లై మోపులు తమ తాలూకు జనం కాపులచే చంపబడ్డ శవాలుగా భ్రమించి సుమారు రెండుమూడు ఫర్లాంగుల మేరలో దక్షిణదిక్కున వున్న గౌతమిని యీదు కొని, వొకడు పోయిన తోవ పొకడికి తెలియకుండా “ చెట్టుకొక రుడై " పాణాలు దక్కించుకుని పాటిపోయారు. అక్కడ గౌతమి, ధవళేశ్వరం వద్ద వున్నంత కాకబోయినా వొక మైలుకు తక్కువ వుండదు. వాళ్ళుగనక పాణాలతో ఆవలివొడ్డు చేరుకున్నారుగాని యింక యొవశ్ళేనా అయితే ' నదీనాం సాగరో గతి " కావ లసిందే.

కాపులు చేసిన యీ వుపాయం బలిష్టులూ, అధిక సంథ్యాకులూ అయిన అగ్నికలక్షతియులను యూవిధంగా పాఱదోలిన తరువాత యిక పూరేగింపులో మిగిలినసరుకు, (1) పెళ్ళికూతురు (2) పెండ్లికొడుకు, వీరెక్కిన పల్లకీ, (3) పల్లకీబోయీలు (4) పెండ్లివారి ముఖ్యబంధువులు యింతకుమించి లేరు. వీళ్ళని కనగాల పేటకాపులు జయించడాని కేముంది. శాష్ట్రాల మందను తోలినట్లు అసలుగా మానికి తోలుకు వెళ్ళేటంతలో గామంలో పుండే పముఖులు కలిశారు. పల్లకీ విఱిచారు. శివాలయం వద్ద వున్న గోదావరీత్రూము లో పూర9క్కి నానాహంగామా చేసి అగ్ని కులస్థుల యిళ్ళలో జొరబడి కొల్లగొట్టినట్లు చెప్పగా విన్నాను.

ఆ మహాకోలాహలం ఆపడానికి గవర్నమెంటు శాయశక్తులా పయత్నించిన్నీ కృతకృత్యం కాలేక తుదకు బిటిషు గవర్నమెంటకు తంతి నివ్వడం జరిగిందనీ, కాకినాడనుంచి పటాలం వచ్చేలో పున గ్రామం దరిని వున్న పుప్ప పేటిలోవున్న తొట్టిపడవలూ, వేటనా పలు వగయిరా