పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గీ. వేశ్యమాత యెపుడు విటునితోఁ జనువుగా
    మాటలాడఁదగదు మఱియు నతఁడు
    బెదరునట్లుకూఁతుఁ బిట్టునిందింపంగఁ
    దగును దొరకె మంచితగులమనుచు.

సీ. పయనమేగెడునట్టి ప్రియుఁజేరి వగచుచు
                  వేగరమ్మని యొట్టు పెట్టవలయు
    నాలసించిన విరహాగ్ని కీలలమ్రగ్గి
                  యొడలు బాసెదనంచు నుడువవలయు
    విటునాప్తు లెఱుఁగ నెప్పటికివచ్చు ప్రియుండ
                  టంచుఁదాశకునంబు లడుగవలయుఁ
    బ్రియుని మిత్రులుజూడ రయముగా నతఁడు రా
                  వలెనంచు వ్రతములు సలుపవలయు

గీ. నతఁడువచ్చినపిదపఁ జిత్తార్తిదెలిపి
    యోజశ్రీకామదేవుని పూజసలిపి
    మ్రొక్కు లెల్లను జెల్లించి మురియవలయు
    వల్లభుఁడుజూచి నమ్మివిభ్రాంతిబడగ.

క. సరసున కాపద గలిగిన
   వరుసనలంకారములను వర్జింపఁదగున్
   పరుసమగుమాట లెన్నఁడు
   వరుసన్నిధినాడఁతగదు వారాంగనకున్.

గీ. విటునికవసర మగునట్టి వేళలందుఁ
   దనదునగలీయఁదగు నమ్ముకొనుడటంచు
   సారధనుడౌటఁ గార్యంబు దీరినంత
   దానికిబ్బడినీయక మానఁడతఁడు.