పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కస్సుకథ.

291

త్రిభువనభారవాహకుండైన భోజునకు నీమృగములభారము వహించుట యొకచిత్రమా? అనిచెప్పుటయు నళ్ళాణుండు వెఱగుపాటుతోఁ గవీంద్రా ! ఈమేషము ధారానగరాధీశ్వరుండని పలికితివేల ? అమ్మహారాజు శప్తుండయ్యెనా యేమి ? నిజముచెప్పుము. అనుటయు నక్కవిశేఖరుం డది నాకునుందెలియదు. దైవికముగా మీరడిగిన ప్రశ్నమున కట్టిసమాధానము నానోటినుండి యప్రయత్నముగా వచ్చినది. అనిచెప్పుటయు నాజనవల్లభుం డంతటితో నాయాట జాలింపుమని యాజ్ఞాపించి యేకాంతముగా వానిఁ దనయంతికమునకు రప్పించుకొని యీ మృగములన్నియు నెక్కడసంపాదించితివి? ఈసాధనము లెట్లు నేర్చితివి? అనియడిగిన భైరవుండు వీనినెల్లఁ బిల్లలుగానున్నప్పుడు సంపాదించి యాట నేర్పుచుందునని యేమేమో బొంకెను.

వలసినంతద్రవ్య మిప్పించెద నాగొఱ్ఱెను మాకిత్తువా? అనియడిగిన నాబ్రతుకంతయు దానితోనున్నది. ఇయ్యఁజాలనని వాఁ డుత్తరము చెప్పెను. ఆవిషయమై వారిరువురకుఁ బెద్దసంవాదము జరిగినది. భైరవుఁడు రాజును వంచించుతలంపుతో నట్లేయిత్తుననిచెప్పి కొన్ని కానుక లంది యఱేయి వేకువజామున నొరులెఱుఁగకుండఁ బ్రయాణమగుచుండ రాజకింకరులు వోయి యూటంకపఱచి బలవంతమున నాగొఱ్ఱెను లాగికొనివచ్చి రాజున కర్పించిరి.

కాళిదాసకవి యాగొఱ్ఱెయొద్దకుఁబోయి దువ్వుచు మహారాజా! సత్కవికల్పభూజా ! నీవిట్లు మేషమవై పోయితివేమి ? నిన్నేవ్వ రిట్లు కావించిరి ? భూభారం బెవ్వరిపైఁ బెట్టివచ్చితివి ? అటఁ గవుల కాధార మెవ్వరు ? ఏదోయనినంతమాత్రముననే యందునిలువక విశ్వాసము లేక చిరకాలస్నేహము గణింపక లేచివచ్చిన యీకపటమిత్రునిఁ జూడ వచ్చితివా ? తండ్రీ! నీ వజాతశత్రుండవే ని న్నెవ్వరిట్లువంచించిరి? వదాన్యా ! నన్నుఁజూడక రెండుగడియలు నిలువలేకుండువాఁడ విప్పు డెట్లు