పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

“శ్రీమత్పండిత మధిర సుబ్బన్న దీక్షితుల వారిచే రచింపఁబడిన "కాశీమజిలీకథ" లను పేర నొప్పు కథాసమూహ మింత కాంధ్రదేశమంతయుఁ జక్కఁగా నెఱింగినదే కావున నేను బ్రశంసింపవలసిన యావశ్యకత లేదు. ఆ గ్రంథముల కిడిన కేవలనామము సహితము మనకుఁ బవిత్రమైన భావమును హృదయమున నుత్పాదింపఁ జేయుటయేకాక పూర్వకాలమున రాకపోకలకు మసకువలె సౌలభ్యములు లేకుండియుఁ గ్లేశపడియైన మన పెద్దలు కాలినడకతో పుణ్యపట్టణమైన కాశీని దర్శించి రాఁగలంత భక్తిశ్రద్దలు వహించి యుండిరను నాశ్చర్యము గలిగించుచున్నవి. జనసమూహముల నాహ్లాదింపఁజేయుటకుఁ గధాకథనము మన హిందూదేశములో నతిప్రాచీన విద్యయే. దానికి రెండువిధముల ప్రయోజనము గలదు. ఈ కథలు ధర్మపరాక్రమముల తత్త్వ ప్రభావముల నుపదేశించుటయేకాక అప్పటి దీర్ఘకాల మార్గాయాసమును యాత్రికసంక్లేశమును దొలఁగించుచుండును. మతవిషయమునను ఆధ్యాత్మిక విషయమునను విశ్వాసములేక శంకాకళంకితమగు నేఁటికాలమున స్వభాషలో సులభశైలి వ్రాయఁబడిన యీ కథలు హిందూదేశమున నాదియగు వేదశాస్త్ర పురాణాది విద్యాప్రపంచమున నేదియేది శ్రేష్ఠమో శాశ్వత స్మరణీయమో దానినెల్లఁ దప్పక బునరుజ్జీవనము చేయుచున్నవి. ఇవి యవనయామినీ వినోదకథలలోని చమత్కృతి ప్రభావము చూపుచున్నను శబ్దరచనయందును, భావముల యందును అశ్లీలధర్మసాంకర్యాది దోషములు లేక భాసిల్లుచున్నవి. కథలకిచ్చిన పేరును, సంవిధాన ధోరణియు సమస్తవిషయ సంగ్రాహకమగుటచే యట్లే కొనసాగుచుండిన యెడల నిది తప్పక హిందూపురాణ గాథా కోశమై సర్వవాఙ్మయమున కాదర్శమై యొప్పుననుట యసాధ్యముగాదు.

ఇట్లు,

బ్రహ్మశ్రీ శ్రీమాన్ యమ్. కృష్ణమాచారి

M. A. M. L. P.H. D.