పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఆర్యా! మీరెన్ని సాదృశ్యములు చెప్పినను నాకొప్పిదములు కావు. ధనాగమనమునకు విద్యయు గౌరణముకాదు. అదృష్టము ముఖ్యము. దానిబట్టియె లాభాలాభములు గలుగుచుండును. "విద్యత్సుదారిద్రతా" అను నార్యోక్తి వినరా! విద్వాంసులే తఱచు దరిద్రులైయుందురు. నాకు మనపట్టిని గుణవర్మకిచ్చుట యెంత మాత్రము సమ్మతములేదు. ధనవర్మకే యియ్యవలయునని పతి కెదురుకొని యుత్తరము జెప్పినది.

తన్మూలముగా నాదంపతులకు బెద్దతడవు వాదము జరిగినది. అప్పుడు భార్యపై గోపము వచ్చి మాతండ్రి యామె చెప్పిన మాటలు లక్ష్యము సేయక అప్పుడే గుణవర్మకు నన్నిత్తునని గుణవర్మ తండ్రి వీరపాలునికి శుభలేఖ వ్రాయించెను. మాతల్లి చంద్రమతియు ధనవర్మ తండ్రి శూరపాలునికి నీకుమారుడు ధనవర్మకు నాకూతు నిత్తుననియు ముహూర్తమునాటికి రహస్యముగామీరువచ్చి నిరూపింపబడిన గృహమునం దుండవలయుననియు చేటిక చేతికిచ్చి యచ్చిగురుబోణిని మీయొద్ద కనిపెదననియు మీరు వివాహము జేసికొని తీసుకొని పోవలయునని ప్రచ్ఛన్నగా శుభలేఖ వ్రాయించినది.

ఆయిరువురు మదీయసౌందర్యవిభవాతిశయములు విని యెట్లైన నాపడుచును పెండ్లియాడినంజాలు నని యున్నవారు కావున నట్టిశుభలేఖ వచ్చినతోడనే సంతోషించుచు నందు నిరూపింపబడిన శుభముహూర్తము కిరువురు నాపట్టణములోనికి వచ్చిరి.

మాతండ్రి వీరపాలునికి పరివారముతోగూడ దగిన విడిదెల నియమించి మించినసంతోషముతో లుపచారములు చేయింపుచుండెను.

మాతల్లి రహస్యముగా వచ్చియున్న శూరపాలుని వార్తవిని సంతోషించుచు గూఢముగానే విడిదినియమించి అందు బ్రవేశపెట్టి ముహూర్తకాల మరయుచుండెను.

ఆముహూర్తము వేకువజామున నిశ్చయింపబడినది. కావున రాత్రి పడినతోడనే వీరసేనుడు మెండువైభవముతో బెండ్లికుమారుని బల్లకిలో నెక్కించి దీపికాసపుంజమున రా వెలఁగ వేణువీణాపటహాది వాద్యఘోషముచే నాకసము బీటలువార, వారాంగనానృత్యగానవినోదములతో నూరేగింపుచుండెను.

శూరపాలుడు సైతము పేరుసెప్పక తనకుమారు నొక పల్లకిలో నెక్కించి తగువైభవముతో నేగి పెండ్లి ప్రయత్నము చేయింపుచుండెను.

జయభద్రా! నేనేమని చెప్పుదును? ఆట్టిసమయములో నన్ను బెండ్లికూతురుగా జేసి వింతనగలచే నలంకరించిరి. మఱియు మాతల్లి నన్ను జీరి రహస్యముగా నిట్లనియె.

అమ్మా! ని న్నొకదరిద్రుని కిచ్చి మీతండ్రి నీగొంతువు గోయదలంచుకొన్నారు. నిన్ను కడుగారాముగా బెంచితిని. ఆదరిద్రమెట్లు సైరింతువు. ఇందులకు వేఱొక యూపాయ మాలోచించితిని. వినుము నీవిషయమై శూరపాలుని కుమారుడు ధనవర్మను