పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కాశీమజిలీకథలు - మూడవభాగము

చావునకు దెగించిన నాకేయాపదలు లక్ష్యములుకావు." అని తలపోయుచున్న సమయంబున నీటిలో వ్రేలాడుచున్న తనపాదముల కేదియో తగిలినది.

అది మొసలి మొదలగు జంతువులలో నొకటిఅగునని భయపడుచు, రెండుమూఁడుసారులు విదల్చి వైచెనుగాని, మృదువైన వ్రేళ్ళు కాళ్ళకు దగిలినట్లై, నంతలో మనుష్యుడై నట్లు నిశ్చయించి యా వ్రేళ్ళకు కాలందిచ్చెను.

ఆవ్రేళ్ళతోఁ దనకాళ్ళు పట్టుకొ"నినట్లు తోఁచినతోడనే కాలు పైకిలాగికొనియెను. పిమ్మట జేతితోఁ దడిమినంత నీటియందు నాచువలె పైకి వ్యాపించియున్న వెండ్రుకలు కొన్ని చేతికిఁ దగిలినవి.

ఆవెండ్రుకలు చేతికిఁ బెనవైచుకొని మెల్లగాఁ బైకిలాగినప్పు డద్భుతముగా మృదువైన పరిమళము గొట్టినది. ఆతావి యాఘ్రాణించి అతండు వెరగందుచు, మఱియుం దడిమినంత, మృదువులైన, అవయవములు చేతికిఁ దగిలినవి. అప్పు డతండది యొకచిన్నదని యూహించి అయ్యో! నన్ను వలె నీయబలనుగూడ, నీ నూతిలో నే దుర్మార్గులోఁ బడవైచిరి. దీని కాయుశ్శేషమున్నట్లే తోచుఁచున్నది. నాయోపినంత ప్రయత్నము చేసి దీని ప్రాణములు గాపాడెదనని నిశ్చయించి మెల్లమెల్లగా పైకిలాగి మోము తడవి యెత్తిపట్టుకొని, కౌఁగిటనాని నీటిలో మునుఁగ కుండ నదిమిపట్టుకొనియెను.

ఆచిన్నదియు నొడలెఱుంగక గుండెలు తటతటఁగొట్టుకొనుచుండఁ గన్నులు మూసికొని జయభద్రుని భుజాంతరమున వసియించి యలసట దీర్చుకొనుచుండెను.

వారియాపదఁ జూచి యోదార్చువాఁడువోలె లోకబాంధవుం డుదయగిరిశిఖర మలంకరించెను. తదీయ హృదయాంధగారముతోఁగూడ నానూతిలోన చీఁకటి విరిసిపోయినది

అప్పు డొండొరులు చూచుకొని, వారిరువురు నాశ్చర్యమందిరి మఱియు జయభద్రుఁ డాచిన్నదానిఁజూచి నేత్రములు విప్పి చూచుచున్నది కావున మెల్లన నిట్లనియె.

తరుణీ! నాకువచ్చిన యవస్థ నీకును వచ్చినదా! నీయాకృతిం జూచి సహింవక యేదుర్మార్గుఁడిట్లు కావించెను? నీముద్దుమో మేకఠినాత్ముని కన్నులకు వెగటైనది? కటకటా! మెఱపుతీగఁవలె మెఱయుచున్న నీదేహ మీనూతిలోఁ పారవేయుట కేద్రోహునకు జేతులువచ్చినవి. ఇటువంటి కఠినదండన జేయుటకు నీ వేమి నేరముఁ జేసితివి? నీయాయుశ్శేషము దృఢమైనదని నమ్ముచున్నాను. అర్థరాత్ర మిట్టిపాడునూతిలోఁ బడియును నాధారముబూనియుంటివి. అనిఅడుగగా నా చిన్నది హస్తసంజ్ఞచేయుచు బైకిబోయినవెనుక నంతయుం జెప్పెదనని సూచించినది.

అప్పు డాసన్న గ్రహించి, జయభద్రుడు ఆ చిన్నదానిచేతి కొకదృఢమైన