పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(24)

నాగమణి కథ

193

కొనివచ్చినది. నన్ను దన సఖురాలననుకొన్నది. కానిమ్ము నిజము దెలియనీయక దీనితోబోయి కొంతసహాయము గావించెదనని తలంచి యేమియు మాటాడక ఊఁ ఊఁ యని యుత్తరమిచ్చెతిని.

అప్పుడప్పడతి నా మేను తట్టుచు రామామణీ? లేవ వేమి? మంచిదానవే ఇప్పుడు నిద్రపోవు సమయమే? బండిచూచిరా? అని పలికిన నేను మెల్లగాలేచి వాకిటకు బోయినంత నప్పుడే బండివచ్చి యచ్చట నిలువంబడినది.

అమ్మదవతి యా ధ్వనివిని తానుగూడ నచ్చటికివచ్చి బండిదాపునకు నా చేయిపట్టుకొనిపోయినది. అప్పుడు బండిలోనుండి యొక మగువ క్రిందికిదిగి వినయయముగా నందులో నెక్కుడని సంజ్ఞచేసినది. నేనేమియు మాట్లాడక యందెక్కితిని. తరువాత నా నాతియు దానితో వచ్చి మగువయు నెక్కి తలుపులు బిగించిరి.

బండివాడు దాని నతివేగముగా నడిపించుచు స్వల్పకాలములలో నొక సముద్రము రేవునకు దీసికొనిపోయెను బండి నిలిచినతోడనే యొక పరిచారిక వచ్చి తలుపు తెరచి రండు రండని పిలిచినది. మేమందరము బండిదిగి దానివెంట బోయితిమి. అందొక యోడ సిద్ధముగా నున్నది. దానిలోనికి మమ్మాపరిచారిక దీసికొనిపోయినది.

ఆ యోడ మిక్కిలి విశాలముగానున్నయది. మనోహరములైన వస్తువులచే నలంకరింపబడియున్నది. నలుమూలలకు గాజుదీపములు పెట్టియుంచిరి. రాజభవనము కన్నను సుందరమైన యా యోడలో నొక గదిలో మమ్ము బ్రవేశపెట్టి యా పరిచారిక యరిగినది

ఆ దీపముల వెలుంగున నన్ను నిదానించి చూచి యా చిగురుబోడి అయ్యో! రామామణి యేది? బండిలో దిగబడినదియా యేమి? లలనామణీ పిలిపింపుము. ఓడ త్రోయుదురేమో నిలుపుమనుము. అని తొందరగా బలుకుచు గట్టుదెసంజూడ దొడంగినది.

అప్పుడు నేనించుక నవ్వుచు జవ్వనీ! రామామణి యెవ్వతె? ఎందున్నది? నీతో వచ్చినదా యేమని యడిగితిని. అవును నాతో వచ్చినది. బండిలో దిగబడెనో, యెందేని బోయెనో తెలియదు. అది నా ప్రాణసఖురాలు దానిజాడ తెలిసికొనలయునని పలికినది.

నేను నీతో బండిలో వచ్చితినే? నేనుగాక మఱియెవ్వరుసు బండిలో నెక్కలేదు. మొదట బండితో వచ్చిన స్త్రీ యీ లోనికింబోయినది. రామామణి యెప్పుడు వచ్చినదని పలికితిని. అయ్యో! నీవేమియు నెఱుగవు మా రామామణి యీ యోడదాక నాతోడనే నడచినది. దారితెలియక యేమూలకో పోయి యుండవచ్చును. కొంచెము పిలిచిపెట్టుము. నీ యుపకారము మఱువనని యత్యాతురముగా నడిగిన విని నేను నవ్వుచు నిట్లంటిని.