(21)
తెనాలిరామలింగకవికథ
169
మందా - మేలు. మేలు. సరే విద్రుమోష్టియు నిట్లే చెప్పునా ?
విద్రు - నేనట్లనుదాననని తలంచితివా? నామాట విని పిమ్మట నాక్షేపింపుము. (చెవులో) "నాకిపుడు రోగములబాధ అతిశయించుచున్నది. మార్గములో బధ్యపానాదులు సరిపడవుగదా!" ఇంటికిబోక యేమిచేయుదును? ఇదివఱకు రాజభోగముగా జరిగినది. గావున నే లోపము కనిపించలేదు.
మందా - భళాభళ! ఒక్క దానను బోవలయును గాబోలు. శరచ్చంద్రిక యెక్కడనున్నది. దాని సంకల్ప మేమి?
శరచ్చంద్రిక - అమ్మా! నేనిక్కడనేయుంటిని. నాసంకల్పము మఱియేమియునులేదు. మాచెల్లెలు తల్లి లేనిది. దాని నేను పెంచి పెద్దజేసితిని. అది యిప్పుడు గర్భవతి అయ్యెనని యుత్తరము వచ్చినది. దాని జూడవలయునని మిక్కిలి వేడుకగా నున్న యది. ఈ సమయముదాటిన నా వేడుక యెట్లుతీరును. అది బిడ్డగనినతోడనే బయలుదేరి వత్ తునిదియే మదీయవాంఛితము.
మందా - సేఔను. దైవమా!: నీపట్టు దిట్టమైనదికదా ! మా ప్రియంవదయు నిటులే పలుకునా? పలుకదు. అది నాప్రాణములలో నొకటి. ఏమో, నిర్భాగ్యులను ప్రాణమిత్రులును పరిహసింతురను వచనమున్నది ప్రియంవద యెక్కడ .
ప్రియంవద - (కన్నీరునించుచు) వయస్యా? నీ హీనస్థితిని గుఱించి చింతించుచు నిందేయున్నదాన. ఏమి యాజ్ఞ.
మందా - వీరిమాటలన్నియును వింటివా ? ఢిల్లీకి నాతో నెవ్వరును రారట. తలయొక మిషను జెప్పుకొనుచున్నారు. కానిమ్ము. వారి ననవలసిన పనిలేదు. నీవైన వత్తువా!
ప్రియంవద - నేను నీతోరాక యెక్కడికి బోదును. నాకు వేఱొకదిక్కు గలదా? నేను నీతో మంచిచెడ్డల ననుభవింపగలదాననే. వీరినందరం బోనిమ్ము, మనయిరువురమే పోయి విజయమును గయికొని వత్తుముగాక.
అని చెప్పువరకు వేళ అతిక్రమించుటయు మణిసిద్దుడా కథదేసంతవరకు నిలిపి తరువాయి వృత్తాంతము తదనంతరనివాస ప్రదేశంబున చెప్పదొడంగెను.
శ్లో॥ యెనథ్వ స్తనునోభవేన బలిజిత్కాయఃపురాస్త్రీకృతో।
యశ్చోద్వృత్తభుజంగహాలవలయో గంగాంచయోధీధరతీ।
యస్యాహుశ్శశిమచ్ఛిరో హరఇతిస్తుత్యంచ నామాపరం ।
పాయాత్పస్వృయమంధకక్షయకరోమాంసర్వదోమాధవః ॥