పుట:Jeevasastra Samgrahamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మబీజాశయములు.

ఇవి చిత్రమైనవిగను గ్రహించుటకు కొంచెము కఠినమైనవిగను ఉన్నవి. సూక్ష్మబీజాశయము గుండ్రముగను నారింజరంగుగల చిన్న గోలీకాయవలెను ఉండునని చెప్పియుంటిమి. ఇదియొక చిన్నతొడిమ (Stalk) చే ఆకు నంటియుండును. దానిగోడలు 20-వ పటములో A. B. లలో జూపినప్రకారము విల్లువంపుగా నుండెడు ఎనిమిది బద్దలచే (బ) జేయబడినది. ఈ బద్దల కొనలయందు కక్కులు గలవు. ఒక బద్దయొక్క కక్కులు (కరుకులు) మరియొక బద్దయొక్క కక్కులలో నిమిడియుండుటచే నివి యతుకుకొనును. ఒక నారింజపండును ఒక దాని కొకటి సమకోణము (Right angel) గలవగు రెండుకోతలచే నిలువున చీరి నాలుగు పొడుగైనముక్కలు చేయుము. ఇట్టిపండును నడుమ నడ్డముగా పై జెప్పిన కోతలకు సమకోణము లగునట్లుగా నొక కోతచే కోయుము. ఇట్లు జేసిన నా పండు ఎనిమిది సమభాగములగును. ఈ ముక్కల అంచులందు రంపపుపండ్లవంటి కక్కులుండునని తలచుము. ఇం దొక దానికక్కులు మరియొక దాని కక్కులలో నమరియుండునట్లు అతికి తిరిగి నారింజపండు ఆకారమును ఏర్పరచవచ్చును. ఇదేప్రకారము పై జెప్పిన సూక్ష్మబీజాశయముయొక్క ఎనిమిది బద్దలును అతుకుకొని యుండునని గ్రహించవలయును.

ఈ బద్దలలో ఒక్కొక్కటియు ఒకప్రక్క లోటును, రెండవప్రక్క ఉబ్బును గల ఒక్కొకకణము. దాని లోపలితట్టున