పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

237



9. అతి విపులమైన ఆనంద లహరియై పరలోకమందు సద్వస్తువు నుండి వ్యాపించిన చిత్తు తిరుగ నిఖిలమయిన యాకాశమున వ్యాపించి, జగత్తును ధరించుచున్నది. అట్టి పరాశక్తి ప్రకాశించుగాక. (4 వ శ్లోకములో చెప్పబడినట్లిక్కడను గ్రహించవలెను.)


10. ఓ పరాత్పరా ! ఆ హేతువువలన ఆకాశముకంటె పద్మనేత్ర శరీరము (స్త్రీరూపిణి) నీకు వేఱుగాలేదు. అట్లైనను, నమస్కరించువారి బుద్ధి ననుసరించి నీవు శరీరములను దాల్చు చుంటివి.


11. ముల్లోకములను పాలించుచు, సకలమరుద్గణమునకు బ్రభువైన దేవేంద్రునితోసహ చంద్రముఖముగల్గి పుట్టుక లేనిదై, శరీరమును ధరించిన శచీదేవి పాపరహితజగత్తునందు (స్వర్గమందు) సదా ప్రకాశించుచున్నది.


12. (ఆర్య) కులము బహుభేదములను బొందియున్నది. భుజబలమా లేదు. భారతీయులు విపత్తుల నెట్లు దాటగలరు ? ఓ తల్లీ ! ఇప్పుడీ విపన్నాశనముకొఱకు సమర్థమైన నీ చరణమును నేను శరణు బొందుచుంటిని.


13. స్వదేశ పండితులయొక్క విధానపటలము గూడ సమస్తము విఫలమైనది. కనుక (ఆధునికోపాయముకొఱకు) ఓ తల్లీ ! దౌర్భాగ్యమును ఖండింపగల నీ చరణమును నేను శరణు పొందుచుంటిని.


14. ఓ మహేశ్వరీ ! నా జనులు నితాంతదుర్గతిని బొంది, వారి కుక్షిని బోషించుకొనుటకు గూడ నసమర్ధు లగుచున్నారు. ఓ తల్లీ ! ఇప్పుడు దయ యను మకరందముకొఱకు నీ పాదమును శరణు పొందుచుంటిని.