పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

179



5. సమస్త లోకములకు నాయకురాలైన ఆకాశశరీరిణి యగు తల్లి యొక్క మహనీయమైన మహోంశయొక్క సారమును పండితులు తటిత్తనుచున్నారు.

(తేజోంశ సారమును. ఇది వస్తువుతో కూడి సహస్సై తిరుగ వస్తువునుండి సారమువలె వస్త్వనుభవరూపిణియై మహస్సుగా నివృత్తియగును.)


6. నిగూఢ తేజోంశశరీరముగా గల యీ అంబిక సర్వత్ర ప్రకాశించు ప్రచండ చండిక యగుచున్నది. అవ్యక్త శబ్దాంశ శరీరముగా గల దేవియొక్క వికల్పమును (విభూతులను) కవులు భిన్న (దేవీ) నామములతో పిలచిరి.


7. శబ్దము లేనిదే తేజస్సు లేదు. తేజస్సు లేనిదే శబ్దముండదు. ఈ రెండును నిత్యము కలసి నీ శక్తిద్వయమగునప్పుడు, వానిచే నీ స్వరూపమున కెట్లు వ్యత్యాసము కలుగును.

(శబ్ద తేజములు రెండు శక్తియొక్క క్రియా చిచ్ఛాఖలు. ఈ రెండింటికి మూలశక్తి యొక్కటియే గావున మూలస్వరూపము నెఱుగుటకు రెండు మార్గములు విధింపబడెను.)


8. ప్రకృష్టమై యొకేశక్తి జ్వలించుచు, శబ్దించుచు నంతటను బ్రకాశించునప్పుడు పండితులచే చెప్పబడు శక్తిద్వయము క్రియాభేదమందే సమర్థనీయమగును.

(అనగా శబ్దించుట, జ్వలించుట అను క్రియలవలననే శబ్ద తేజములను వేఱుచేయగలమని భావము.)


9. ఒకే క్రియకు ఫలభేదమువలన తిరుగ విభాగము పండితులచే చేయబడెను. శ్రేష్ఠస్వరమును (ఫల భేదమువలన) 'కాళి'గాను, 'తార'గాను చెప్పుచున్నారు; తేజస్సును (ఫల భేదమువలన) చండికగాను, లలితగాను చెప్పుచున్నారు.