ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెల్లవారలు నీతి నిపుణులు,
ఢిల్లి పట్టము గట్టి రిపుడే
కల్ల యెరుగని జార్జిరేని,
కజాత శత్రునకున్.
నల్లవాడును తెల్లవాడును
నెల్ల శుభములగూర్చు గావుత
తల్లి మేరీ మహారాజ్ఞికి
జార్జి నరపతికిన్.
1912 డిశంబరు మాసాంతంలో పంచమ జార్జి కలకత్తా నగరం వస్తున్న సందర్భంలో 'రాజ రాజుకు బహూకరించడానికి, “రీవారాణి అప్పారావుతో చెప్పి రాయించిన గేయం” ఇది. 1929లో గురజాడ రామదాసు ముద్రించిన 'ముత్యాల సరము'లో దీన్ని చేర్చారు. (కె. వి. ఆర్. మహోదయం - 1969 ప్రతి, పుట. 154}
గురుజాడలు
68
కవితలు