78
వరకు ధర్మార్థముగా యిచ్చిరి. వీరిని ప్రశంసించుచు సభ ముగింపబడెను. తరువాత బాల బాలికలచే శ్రీయాళ నాటకము ప్రదర్శింపబడెను.
— దేవాంగం వెంకటనరసయ్య, కార్యదర్శి
స్త్రీ సనాతన ధర్మమండలి
చతుర్వింశతి వార్షిక రిపోర్టు
శ్రీ మదఖఁడ సచ్చిదానంద నిత్యనిర్మల పరిపూర్ణ స్వరూపుడగు శ్రీ గోపాలకృష్ణపరమాత్మ కృపాకటాక్ష వీక్షణామృతధారలచే యభివృద్ధినొందుచున్న సనాతనవృక్షమునకు ఇరువదినాల్గవ వార్షికోత్సవము జయప్రదముగా జరుపఁ గల్గితిమి. ఈవృతు, మేటేట నవాంకురముల నీనుచు స్వధర్మ పుష్పములు భక్తి ఫలములచే నలంకార భూయిష్టమై నలుదిక్కుల నావరించి విరాజిల్లుచున్న వృక్షాగ్రభాగమున ప్రకాశింపుచున్న ధర్మకుసుమ వకరందాస్వాదన మొనర్చు అళిదళ ఝంకారంబులు ట్లహర్నిశ గీతాభావ్యది పవిత్ర గ్రంథ పఠనంబును, త్రిపురారహస్యాది ఆగమశాస్త్రనినాదంబులును, బ్రహ్మవైవరకాది పురాణశారికా వినోదంబులును, మహాభారతాది ఇతిహాస వాణీ శుకభాషణంబులును, వసంతసమయ సవపల్లవ భక్షణతృప్తయను కోకిల నాదము, రసికజనమనోల్లాస మొనరించునట్లు భగవత్కథాసుధామధురము జవిగాంచిన భక్తుల కాహ్లాదమగునట్లు హరికథా ప్రసంగములును, దైవభక్తి ప్ర్రాధాన్యములగు భజనలును, ఇహపరలోక సాధకంబులగు ఆశ్వర్యంబు లొసంగు మంత్రోపాసనాదులును, బ్రహ్మా త్మై