Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

కరము చేసి వైచిరి, లోకులుబోర్డు శాసనము ప్రకారము శాసనముపకారము ఆటవీ పరిపాలనము, పంటనీటి పంపకము, ధర్మాదాయ ముల పరిపాలన—ఆది ఇది యన నేల ప్రభుత్వమువారుగాని ఇతరలో కలుబోర్డులు గాని ఇతర ధర్మసంస్థలు గాని పంచా యతులకు సంక్రమింపజేసే అన్ని యధికారములును పంచా యతులు జరుపుకొనవచ్చుననుట ఈశాసన సవరణలో చేర్చిరి. కాని సంక్రమింప చేసే పుణ్యాత్ము లెవరు? మంత్రులు రాజ్యమేలినా జరుగుబాటు నిరంకుశాధికారుల దేగ దా !

కొంత కాలమునకు తరువాత బొబ్బిలి తన ముఖ్యమంత్రి త్వములో తాలూకాబోర్డులను రద్దు చేయగా జూచి పంచా యతులు విరివిగా సాపనయగునని మాబోటివారి కలలను మహారాజులు తీరురని భ్రమపడినవారు కొందరు కలరు. కాని వారి తాలూకాబోర్డుల రద్దు జిల్లాబోర్డుల విభజన లకు పార్టీలను బలపరచడానికి కుంగదీయడానికి పనికి వచ్చే యెత్తులకు వినియోగ పడడం దేశ పుదురదృష్టము.

నేటిదినము పరిస్థితులు వూరియున్నవి. గవర్నరులుప్రతి బంధకాలు పెట్టుటలేదని తీర్మానముగా మాట యిచ్చిన పిదప పరగణా పరిపాలనను సర్వస్వతంత్రులుగా ఇం డియా గవర్నమెంటు శాసనపు వీడరాని ఇబ్బందులకు లోబడి కాంగ్రెసువారు తలధరించినారు. వీరు సంపూర్ణ ణ ముగా పంచాయతీ పరిపాలనయే దేశమున స్థాపింపసద్యో గించు పార్టీవారు కావున ఇకముందు జరుగబోయే సవ రణ సవరణమాత్రము గానుండరాదు; పరిపూర్ణమైన పునర్ని ర్మాణముగా నే యుండవలెను. పునాదికట్టడము నిజ మైన పునాది కట్టడమే కావలెను.

శాస్త్రోక్తము గాను ఛాందసముగాను చెప్పదలచుకుంటే ఇంత కాలము అమలులో ఉండే లోకలు బోర్డు చట్టము పై దర్జా ప్రభుత్వపు టధికారి తన ఇష్టము వచ్చినట్టుగా లోకలుబోర్డుల నే క్రింది దర్జా అధికారులను నియమించి తన ప్రతినిధిగా ఈ యీ పనులు చేయవచ్చును, ఈ యీ స్వాతంత్య్రములు పొందవచ్చునని ప్రాతినిధ్యాధికారులను సృష్టిం చే చట్టము గాఉన్నది. ఏర్పడే లోకలు బోర్డు ప్రజల ప్ర్రాతిపదిక పు హక్కు చేత ఏర్పడేదని పైఅధికారు లిచ్చే యాయవారపు బ్రతుకు గాక తనకు స్వతంత్రమగు స్థానమున్నదని ఆనుకోడానికి వీలుగల్పించే చట్టము గాదు.

మనకు సంపూర్ణ స్వాతంత్య్రం సంక్రమించేవరకు ఈ విధమగు చట్టము ఏర్పడుతుం దనుకోడానికి అవకాశము లేదు. కాని ఇందుకు బునాదులు వేసే ప్రయత్నం కాం గౌసువారు చేయవచ్చును. దీనికి మూడు ముఖ్య సూత్రే లవసరం. మొదటిది దేశములో మునిసిపాలిటీలుగా ఏర్పడే భాగాలు తప్ప మరియే భూభాగముగాని, పంచాయతీ పరిపాలనలో లేకుండ ఉండరాదు. ఇప్పటి ప్రతి రివిన్యూ గ్రామమూ ఒక పంచాయతీగా ఏర్పరచడము అత్యవసరం; అప్పుడు దేశానికి ప్ర్రాతిపదిక మైన ఏ గ్రామపు సౌక ర్యాన్ని గూడ ఇతర ప్ర్రాంత్రప్రతినిధులు కొరవడ చేసే అవకాశ ముండదు. కొన్ని గ్రామాలకు ఉమ్మడిమీద జరుగవలసిన పనులు కొన్ని ఉన్నవి: ఉదాహరణము : రోడు ఎనిమేటు చేనే అధికారిని నియమించు కోవడం. నిజానికి ఎసి మేట పనితో గూడ శిక్షణపొందిన ఏడు గ్రామముల గ్రూపు సేవకునిని ప్రస్తుతపు మంత్రి వి. వి. గిరిగారి ఆలోచనను అనుసరించి ఏర్పరచగలిగితే అతడే ప్రతిపంచాయతి కార్యక మమును జూచి ఉమ్మిడిపనిగూడ చేయవచ్చును. అందు చేత ఉమ్మడి కార్యాలకు గ్రూపు పంచాయతీల జాయింటు కమిటీల నేర్పరచవలెను. ఇంకొక ఎన్నికవలన ఏర్పడే జిల్లాబోరు లుండరాదు. ఈ జాయంటుక మిటీల జాయంటుకమిటీ అవ సరమని తోచితే జిల్లావి స్త్రీరపు కార్యమును చూడవచ్చును. లేదా ఇప్పుడు జిల్లాబోర్డు నిర్వహించే కొన్ని పనులు జాయంటు క మిటీలకు వదలి వేసి తక్కినవి ఆయా ప్రభుత్వ శాఖోద్యోగుల వశము చేయవచ్చును. ఇంతటి కార్యకమాన్నీ తనిఖీ చూచుకొ నేపని ప్రభుత్వపు తాబేదారైన లోక లుబోర్డుల ఇనస్పెక్టరుకు సర్వాధికారముతో ఒప్పజెప్పరాదు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు శాసన సభ్యుల నుండి ఏర్పరచవలెను. లోకలుగవర్న మెంటుమంత్రి వారికి నాయకుడు గానుండి లోకలుబోర్డుల ఇనస్పెక్టరును అతని కార్యాలయమును ఈ బోర్డు వశమునందుంచి కార్యక్రమము జరుపవలెను.

మరియొక విషయ మీ సందర్భమున గమనింపదగి యున్నది. గ్రామపరిపాలనమునకు గ్రామపంచాయతి దక్క ఇతర సంస్థలు గ్రామమునందు నిర్మాణము చేయ రాదు. ఇరిగేషన్ పంచాయతులు, ఫారెస్టు పంచాయ తులు, ధర్మాదాయ పంచాయతులువగైరాలు రద్దు కావలెను. ఇట్టి శాసనబద్ధముగాని సంస్థలను అధికారుల ఉ త్తరువు మాత్రము చేత సృష్టితములగు సంస్థలను అవక తవక ఎన్నిక పద్ధతులమీద ఆధారపడిన సంస్థలను వేరు వేరుగా - కల్పించి ' గ్రామములలో దినమొక ఎన్నికకు తావు చేసి యుండడము చేత కలతలు పెరిగిపోయినవి. ఎన్నికలమీది - సంస్థలను—వేరు దృష్టితప్ప ప్రజాసేవమీది దృష్టి లేక పోయినది. కాబట్టి వేరే సంస్థలన్నిటిని గ్రామపంచాయతిలో లీనము చేసి వాని ధర్మము లన్నిటిని వీనికి నొప్పజెప్పవలెను.

ఆయిన న్యాయవిచారణమాత్ర మీ గ్రామ పం చాయ తీలకు పెట్టరాదు. ఇప్పటి పంచాయతీకోర్టులును ప్రజలకు నష్టదాయకములే! ప్రాచీన కాలవ నష్టదాయక ములే! ప్ర్రాచీన కాలములందును న్యాయవిచా