Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనాలి తాలూకా

గ్రంథాలయ మహాసభ

ఒక వైపున నిర్ఘరారావముతో ప్రవహించుచున్న కృష్ణ వేణీ పావనతో "యములు కన్నులపండువు సేయుచుండ వటవృక్ష చ్ఛాయలు ప్రతినిధులకు స్వాగతమిచ్చుచుండ, ప్రకృతి రామణీయక మగుఆరుబయలు ప్రదేశమున ౧-౮-38వ తేదీ మధ్యాహ్నము రేవేంద్రపాడు గ్రామములో పైసభ దిగ్విజయముగా జరిగినది. తాలూకాలోని వివిధ గ్రామముల నుండి, గ్రంథాలయ పఠనాలయముల పక్షమునను, వ్యక్తిగతముగను విచ్చేసిన ప్రతినిధులు దాదాపు అరువదిమంది గలరు. కాక చుట్టుపట్టులనుండియు విచ్చేసిన ప్రేక్షకులును గ్రామస్థులును నాటి రాత్రికి పెదపాలెంలో జరుగనున్న గ్రంథాలయ సంఘప్రతినిధుల యిష్టాగోష్ఠి సమావేశమున కరుగుదెంచిన ముఖ్యులగు గ్రంథాలయ సేవకులును కలసి సభికుల సంఖ్య సుమా రిన్నూరు గలదు. ఇతర తాలూకాల నుండి విచ్చేసిన గ్రంథాలయ సేవకులలో శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు, భూపతిరాజు తిరుపతిరాజు గారు, తేతలి సత్యనారాయణమూర్తిగారు, మల్లెల శ్రీరామమూర్తి గారు, మైలా శామ్యుయల్ గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ముఖ్యులు. చుండూరు వాస్తవ్యులగు శ్రీయుత గండవరపు వెంకటేశ్వర్లు గారి ప్ర్రార్ధనతో సభాకార్యక్రమము ప్ర్రారంభమయ్యెను. తరువాత తెనాలి తాలూకా గ్రంథాలయ కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణంగారు సభకు విచ్చేసిన గ్రంథాలయ సేవకుల నందఱికి నెఱుక పరచిరి.

ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము.

అనంతరము శ్రీయుత చల్లపల్లి మురహరి రావు గారు మహాసభకు విచ్చేసిన ప్రతినిధులకు ప్రేక్షకులకు స్వాగతమిచ్చిరి.

ప్ర్రారంభోపన్యాసము.

అంతట సభాప్రారంభకులగు శ్రీయుత కస్తూరి కుటుంబ రావుగారు కరతాళధ్వనుల మధ్య లేచి, తమయుపన్యాసము నిచ్చిరి.

అధ్యక్షోపన్యాసము.

తరువాత శ్రీ పాతూరి నాగభూషణంగారి చే 'ఉప పాదింపబడి, సభికుల కెరుక చేయబడి, మరికొందరు ప్రతి

ఆరవ సమావేశము రేవేంద్రపాడు నిధుల చే బలపరుపబడిన పిమ్మట శ్రీయుత పుణ్యమూర్తుల రాజశేఖరం గారు అధ్యక్ష స్థానము నాక మించి, తమ యధ్యక్షా భిభాషణమును జెప్పిరి.

డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి గారు:

పిమ్మట తాడేపల్లిగూడెం తాలూకా గ్రంథాలయ సంఘ కార్యదర్శులగు డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి గారు మనపూర్వపు ఔన్నత్యమును స్మరించి, ప్రస్తుతము మన దేశదుస్థితికి కారణము మనము స్వాతంత్ర్యమును గోలు పోవుటే యనియు, తిరిగి మనము స్వాతంత్ర్యమును పొంద వలెనన్న గ్రంథాలయములు, పఠనాలయములు మిగుల నవ సరమనియు, వీనికై సంవత్సర చందాలు సరస్వతీ కట్న ములద్వారా ధనము సంపాదించవలెననియు మొదలుగా గల సంగతుల జెప్పి చివరకు తాలూకాగ్రంథాలయ సంఘ ముల విధులను వివరించిరి.

తీర్మానాము లు ౧ కీ. శే. వల్లూరి సూర్యనారాయణరావు, తోకల నాగయ్య, విచారపు వెంకటదాసు, సూర్యదేవర రాఘ వయ్యచౌదరిగార్ల ఆత్మలకు శాంతిగలుగుటకై యీసభ వారు పరమేశ్వరుని ప్ర్రార్ధించుచున్నారు. ౨ తమ చరిత్ర పరిశోధనాపటిమచే మద్రాసు విశ్వ కళా పరిషత్తువారి మెప్పుపొంది, పి. హెచ్. డి. బిరుదము బడసిన గుంటూరు హైందవ కళాశాలచారిత్ర కోపన్యాస కులగు డాక్టరు మారేమండ రామారావుగారి నీ సభవా రభినందించుచున్నారు. 3 తెనాలి తాలూకా గ్రంథాలయ సంఘమువారు తాలూకాలోని గ్రంథాలయ, పఠనాలయము అన్నిటినుండి వానియభివృద్ధిని గూర్చిన నెలసరి రిపోర్టులను తెప్పించి అవసరమయినవారికి తగిన సలహాలిచ్చుచు సంవత్సరమున కొక తూరియైన ప్రతిగ్రంథాలయమును పరిశీలించుటకు తగిన యేర్పాట్లు చేయవలసినదిగా ఈసభవారు కోరు చున్నారు. • ర పడవలో ప్రయాణము చేయు బాటసారుల విసుగు దలను తొలగించి సత్కాలక్షేపమున కనువగు చక్కని యవకాశ మొసగు బోటు గ్రంథాలయముల బ్యాంకు కా లువ పైనడుచు ప్రయాణీకుల పడవలలో స్థాపించిన పెద P