Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురువు.

"ఇది బుధారాధన విరాజి కొమ్మనా మాత్యపుత్ర తిక్కన సోమయాజి ప్రణీత భారత కథానంతరము" అని తన యుత్తర హరివంశీ గద్యమున సోముఁడు వ్రాసియుంట నీతఁడు తిక్కనయందు గురుభావముకలిగి ప్రవర్తిల్లైనని నిర్నయింపనగును. ఈతఁడు తిక్కన వృద్ధాప్యమున పడుచువాఁడై యుండవచ్చును. శిష్యుఁడైనఁగావచ్చును.

ఇష్టదైవము.

తిక్కన సోమయాజికి వలెనే యీతనికిఁ గూడ హరిహర దేవుఁడే యిష్టదైవము. కావుననే బైచరాజు వేంకటనాధ కవి తన పంచతంత్రమున నిట్లు వక్కాణించియున్నాడు.

క.

ఏచనువుకలదు హరిహర
సాచివ్యమునొంద నన్యజనులకు మదినా
లోచింపఁదిక్కయజ్వకు
నాచనసోమునకు మఱియు నాకుందక్క౯.

మతము.

స్మార్త బ్రాహ్మణుఁడు. శివకేశవ బేధములేని మహామహుఁడునద్వయితీయని యాతని గ్రంథమును బట్టియు శాసనమునుబట్టియు నిర్ణయింపనగును.

తండ్రి.

ఎఱ్ఱయకవి సకలనీతి కధానిదానమునందీ సోమునినిట్లు వర్ణించియున్నాడు.

చ.

వినుతియొనర్తు నాంధ్రనుక
వీంద్రుల నన్నయభట్టు దిక్కయ

  • * * * *

      * * * * * నా

చనసుతు సోముభాస్కరుని ఇందలి “నా చననుతు" అనుదానిననుసరించియు శాసనమునందలి “ నాచ నాత్మజః" అనియుఁ గలవాక్యముల ననుసరించియు నీతని తండ్రి పేరు నాచన్న' యని తెలియుచున్నది. వీరభద్రరావు గారు శాసనము నందలి “నాచనాంబుధి:" అను వాక్యములఁజూచి 'నాచన' యీతని తండ్రి పేరు కాదనిరి.'నాచన'యనునది తండ్రిపేరు నింటి పేరుకూడనని తోచుచున్నది.

వ్రాసిన గ్రంధములు.

ఈతఁడు వ్రాసినది యుత్తరహరివంశ మొక్కటియె దొరికినది. అదియైన కృత్యాదిలేదు. అదియెంతవఱకు వ్రాయఁబడినదో తెలియదు. సోముని వసంత విలాసములోనిదని" అత్తరి విట నాగరికులు" అను పద్యము లక్షణ గ్రంధములఁజూచి వీరేశలింగము పంతులుగారు వ్రాసి యున్నారు. “అంజెదవుగాక" అనునది రెండవ పద్యము. ఈరెంటిలో రెండవది యుత్తర హరివంశములోనిదే! “అత్తరివిట నాగరికుల”ను నది వైజయంతీ విలాసములోనిదని శబ్దరత్నాకరములో వ్రాయఁబడియున్నది. నా మిత్రులగు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారా వసంతవిలాస గ్రంధమునందలి మఱికొన్ని పద్యములు దొరికినట్లును, వసంతవిలాసముయక్ష గానమైనట్లును చెప్పెదరు. శ్రీమానవల్లి రామకృష్ణకవి గారి వద్ద వసంత విలాస ప్రతియున్నట్లు కొందఱు మిత్రులు చెప్పెదరు. ఇదమిద్ధమని చెప్పుటకువీలులేకున్నది.

నాకుఁ దెలిసినంతవఱకుఁ గవిచరిత్రమును సంగ్రహముగ వ్రాసితిని. ఇందుప్రమాదములుండిన నుండవచ్చును. ఈ మహాకవికవిత్వ విమర్శనమునకు మఱియొక సారి బ్రయత్నింప దలఁచితిని. దయామయులగు చదువరులిందలి గుణదోషముల నరసి సత్యప్రకటనమునకు సాయపడుదురుగాక!

వం.సుబ్బారావు.