Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32

లేని వారిలో పములను దొలఁగించుచున్నవి.

శాస్త్రజ్ఞులకు, బండితులకు వివిధ వి షయములలో నూతన పరిశోధన చేయు వారికి నవి చేయు సాయము అమితము, గొ ప్పగొప్ప భాండాగారము లిట్టివారికి నిశ్శబ్దము గానుండు గదులను బ్రత్యేకముగా వందలకొ లఁది పుస్తకములతోఁగూడ నిచ్చి మేలు చే యుచున్నవి. ఉచితముగాఁ గొన్ని యెడలఁ జం దానైన స్వీకరింపకయే వారికి వలయు గ్రం ధముల నెన్ని యైనను సేవకునిమూలముగా నిం డ్లకుఁ బంపి మరలఁ దెప్పించుకొనుచున్నవి.

ఆ దేశమునందు బాఠకులను జక్క గానాద రింతురు. చనవుగా నెల్లరను బీరువాల దగ్గఱ కేగి గ్రంధములం దీసికొననిత్తురు. ఇందుచేఁ గొన్ని యెడలఁ బుస్తకములు పోవచ్చును. కాని వీరిమూలమున నెల్లరకు నష్టము కల్గిం పకుండుట మేలని యానష్టము సహించుచు న్నారు. ఇంకను వారుచేయు లోకోపకార కార్యములు వర్ణింపశక్యముగాదు.

ఈవిషయములనన్ని టిని నెఱ వేర్చుట మన దేశపు భాండాగారములకు సాధ్యమగునని నా యాశయముకాదు. మనకాసాయము, ప్రో త్సాహము, పట్టుదల, సంపద, ఐకమత్యము, విద్య, దేశారాధన, జీవనము లేవు. అయినను మీ రాయుతృష్టాదర్శములను మదిలో నుంచు కొనుఁడు. వీలై నప్పుడెల్ల నాయాదర్శముల లో మెక లేశము నేని మీశ కి కొలఁది చేయుఁ డు. ఉదారాశయములు కల్గియుండుట మాన వులకు జాలలాభకరము. మన భాండాగార ములవారెల్లఱు నీవిషయమును గమనింతు రే ని, నెర వేర్ప శక్తి కొలఁదిం బ్రయత్నింతు రేని ప్రపంచమునకు మహోపకారముకల్గును.

బెంగుళూరు గ్రంధాలయము.

మైసూరు ప్రభుత్వమువారివలన బెంగు ళూరునందు సార్వజనిక గ్రంధనిలయము స్థా పింపబడినది. ఇట్టి గ్రంధనిలయములను స్థాపిం చు విషయము తొలుదొలుత 1912వ సంవ త్సరమున మైసూరు ఆర్ధిక సభలో విద్యాశా ఖవారిచే ప్రస్తావింపబడెను. 1914వ సంవత్స రమున దొరతనము వారట్టి గ్రంధనిలయములను బెంగుళూరునందొకటియు, మైసూరునందొక టియు నెలకొల్పుటకు అనుజ్ఞనిచ్చిరి. బెంగు ళూరు గ్రంధనిలయమునకు గ్రంధములను కొ నుట మొదలగు ఖర్చులకుగాను రు 2000 ల నిచ్చిరి. ఇదిగాక సంవత్సరమునకు రు1500ల గ్రాంటునుగూద నిచ్చుచుందురు.

గ్రంధ భాండాగారము.

మ, అతివాచావిభవంబుతో సభలయం దాటోపమేపార ధీ యుతులై యెంత యుపన్యసించినను లేదొక్కింతయు లాభ మూ ర్జిత కార్యాచరణ ప్రవీణతయె వాసింగూర్చు జ్ఞానా ప్తికై జ ప్రతియూర న్నెలకొల్పు డాంధ్రులు సమగ్ర గ్రంథ భాండారముల్. పోచిరాజు సీతారామయ్య.