Jump to content

పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(13)

శ్రీ వీరేశలింగకవిసమాజము-కుముదవల్లి.

93

పుస్తకములను గూర్చి తఱముగాఁ జెప్పుచు జ సుల నాకర్షించి, వారియభ్యుదయ పరంపరకుఁ గారణభూతుఁడై తనరవలెను.

పాఠశాలయందు మనము విద్యాభ్యాసము నుజేయుట ఎట్లో నేర్చుకొందుము. గ్రంథాల యమ’నందావిద్యను అభ్యసించి జ్ఞాన నేత్రము ను వికసింపఁజేసికొందుము. జ్ఞానసముపార్జన ముతో మాత్రము తృప్తినిజెంది ఊరకుండిన విద్య వలనఁగలుగ వలసిన లాభములను మనము సంపూర్ణమగఁ బొందఁజాలము. విద్యవలనఁ గలిగిన జ్ఞానమును మనజీవితమునం దనుభవ సిద్దమగుదానినిగ నొనర్పవలెను. చాలమంది ఈవిషయమును మఱచి తమజ్ఞానమును వ్యర్థ మగుదానినిగఁ జేసెదరు. అందుచేత వారు ప్రపంచమునకు వ్యర్ధులగుటయేకాక తమ యంతరాత్మలకుఁగూడ వ్యర్థులగుచున్నారు. చదువుకొనిన విద్యవలన మాత్రమే మనము గొప్పతనమును సంపాదింపఁజాలము. చేసిన సత్కార్యములవలననే మన జీవితము వికాసమునుపొంది యశోవంతము కాఁగలదు. కావున సోదరులారా! సంపాదించిన ఎంత అల్ప జ్ఞానమునైనను మననిత్యజీవితమునం దనుభవ సిద్ధమగునటుల చేసిన నేకాని మనజాతియొక్క భావిస్థితి తృప్తికరముగ నుండదను సంగతిని ఎల్లప్పుడును జ్ఞప్తియు కుంచుకొనుఁడు.

సోదరులారా! మీ గ్రామమునందు గ్రంథాలయమును స్థాపించి ఉపయోగకరములగు అనేక గ్రంథములను జేర్చుచున్నారు. అట్లు గ్రంథములను సేకరించుటతోడనే మీధర్మ ము పూలికా కాలేదు. మీకు గ్రంథాలయ మున్నందులకు ఫలముగా గ్రామము ఉన్నతస్థితిలోనికి రావలెను; ప్రపంచమునం ది ప్పుడు జరుగుచున్న అభివృద్ధియందు గ్రా మమున నివసించియుండు ప్రతి పురుషుఁడును, స్త్రీయును, పిల్లవాడునుగూడ పాలుపంచు కొనవలెను. సూగ్రామమిట్టి ఉన్నతస్థితికి వ చ్చుటకు మీరు తదేకనిష్ఠతో అనేక సంవత్స రములు ఎడ తెగక కష్టపడి పనిచేయవలసి యున్నది.

శ్రీ వీరేశలింగకవి సమాజము-కుముదవల్లి.

శ్రీమద్విక్టోరియామహారాణీ చక్రవతిజ్ఞనీ గారి డైమండు జూబ్లీ మహోత్సవ సందర్భమున తమకుగల రాజభ క్తిని వ్యక్త పరచుకొనుటకై, లోకోపకారపారీణులై సంఘసంస్కారధురీణులై ఆంధ్రదేశమాత కడుపున బుట్టి లోకమం దెల్లెడల ప్రఖ్యాతినిగాని ప్రసిద్ధకాముడై విలసి ల్లుచున్న బ్రహ్మశ్రీ రావుబహద్దర్ శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులువారియందు గల దృఢమగు భక్తివిశ్వాసానురాగములనుబట్టి "శ్రీ వీరేశలింగకవి" సమాజమును ఈ చిన్న గ్రామములో శ్రీ భూపతి రాజు లచ్చిరాజు గారి చావడిలో శ్రీ పండ్రంగి చిన్నమరాజుగారి అధిక ప్రోత్సాహముచే ఆ 1897 సంబరం జూన్ నెల 22వ తే - దీని గ్రామస్థులచే స్థాపింపబడినది. ఈ సమాజప్రతిష్ఠా పనకతజ్ఞలగు చిన్నమరాజు గారు తమవద్దనున్న గ్రంధసా మగ్రినంతయు దీని కుచితముగా నిచ్చుటచేతను వాటి నవ లోకన జేయించి విపులముగ బోధించి జెప్పుచు వార్తాప త్రికాభిరుచిని గలిగించుటచేతను ఈ సమాజము క్రమా నుగతముగ అభివృద్ధికి రా మొదలు పెట్టెను. అందుచే ఆస్థలము కుశలమగుటయు, మరికొన్ని ఇతర కారణము