|
యుండును శ్రాంతవాహనుండు నై రయంబునఁ బురంబు సొచ్చి రాజమార్గంబు
నం బోవుచుఁ బథిశ్రమక్లాంతుం డైనసూతు నవలోకించి వెండియు ని ట్లనియె.
| 1550
|
క. |
సూతా నిష్కారణముగ, మాతామహు విడిచి మౌని మాటకు దూతా
నీతుఁడ నై యే నేలా, యేతెంచిలి నిట్టియశుభ మేఁటికిఁ దోఁచెన్.
| 1451
|
క. |
నృపనాశమ్మున నేయే, నెపములు మును చెప్పఁబడియె నేఁ డవి యెల్ల
న్విపులతరంబుగఁ గనుఁగవ, కిపు డెల్లెడఁ దోఁచుచున్న వెంతయు వీటన్.
| 1452
|
వ. |
మఱియుఁ గుటుంభిభవనంబులు సమ్మార్జనవిహీనంబు లై యసంయతకవాటం
బులై ప్రభాహీనంబు లై బలికర్మరహితంబు లై ధూపసమ్మోదనశూన్యంబు
లై యభోజితకుటుంబంబు లై శోభాహీనజనాకులంబు లై యలక్ష్మీకంబు లై
సొబగు దక్కి యున్నవి మఱియు దేవాగారంబులు వ్యపేతమాల్యశోభంబు లై
యసమ్మష్టాంగణంబు లై ప్రవిద్ధంబు లై శూన్యంబు లై యున్నవి యజ్ఞగోష్ఠు
లు పాడఱియున్నయవి మాల్యావణంబులందుఁ బణ్యంబులు ప్రకాశితంబులు
గా కున్న వదియునుం గాక.
| 1453
|
ఆ. |
ఎవ్వ రేమి చెప్ప రేలకొ పాడఱి, నట్లు దోఁచుచున్న దకట పురము
వణిజు లెల్ల సర్వవస్తువిక్రయవృత్తి, యుతులు గానిపగిది నున్నవారు.
| 1454
|
క. |
సౌరాలయచైత్యంబులఁ, బారావతశుకపికాదిపక్షిగణము సం
చారంబు దక్కి యేలకొ, యూరక కన్నీరు నించుచున్నది కంటే.
| 1455
|
తే. |
ఆననమునందు వైవర్ణ్య మడర నశ్రు, కణము లురలఁగ ధ్యానమూకత వహించి
విక్లబత నొంది యున్న దీవీట నున్న, నరసమూహంబు కంటివె నర్మసచివ.
| 1456
|
క. |
అని భరతుఁడు సారథితో, ననిష్టశకునంబు లన్ని యటు పేర్కొనుచు
న్మనమున దైన్యం బడరఁగఁ, జనియెం దొలుతొల్త రాజసదనంబునకున్.
| 1457
|
భరతుఁడు కైకేయిని సందర్శించుట
వ. |
ఇట్లు శూన్యశృంగాటకమందిరరథ్యంబును రజోరుణద్వారకవాటయంత్రంబును
నగుపితృమందిరంబు విలోకించి యందు దశరథుం గానక యప్రియంబు లైన
దుర్నిమిత్తంబు లనేకంబులు గనుంగొనుచు దీనమానసుం డై భయకంపితశరీ
రుం డై మాతృమందిరంబునకుం జని సముచితంబుగా నిజజనని సందర్శించి తచ్చ
రణంబుల కభివందనంబుఁ గావించె నప్పు డక్కైకేయి సంప్రాప్తుం డైనకుమా
రు నవలోకించి రయంబునఁ గనకాసకంబు డిగ్గి యొక్కింతసేవు పుత్రవాత్సల్యం
బున గాఢంబుగాఁ బరిష్వజించి నిజోత్సంగంబున సుఖాసీనుం గావించి చుబుకం
బు పుణికి శిరంబు మూర్కొని చెక్కిలి ముద్దుగొని చిరకాలంబునకు సమాగ
తుం డగుటవలన నానందపరిపూరితాంతఃకరణ యై ప్రేమగద్గదస్వరంబున ని ట్లనియె.
| 1458
|
ఆ. |
అనఘ యెన్నిదినము లయ్యె మాతామహు, మందిరంబు విడిచి మమత మాని
నిన్ను విడువఁజాలెనే యతండు పథిశ్ర, మంబు దీర్చికొనుము మాన్యచరిత.
| 1459
|