పుట:Gopinatha-Ramayanamu1.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాముని సభయందుఁ గుశలవులు రామాయణంబు గానము సేయుట

సీ.

తొల్లి యావైవస్వతుఁడు మొదల్గాఁ గొని యేవంశమున వారి దీధరిత్రి
యేవంశమునఁ బుట్టె నృపలోకవిద్వేషి సమవర్తి సగరాఖ్యచక్రవర్తి
వారిధు లేపుణ్యవంశమువారిచే నటు ద్రవ్వఁబడి సాగరాఖ్య నొందె
నేవంశమునఁ బుట్టె నిలకు మందాకినిఁ గోరి తెచ్చినయాభగీరథుండు


తే.

నట్టియిక్ష్వాకువంశంబునందు శుభద, మైనరామాయణాఖ్యమహాప్రబంధ
మంచితంబుగ నుత్పన్న మయ్యె నిదియ, ధర్మకామార్థసహితమై తనరుచుండు.

179


క.

ఈయాఖ్యానము సర్వ మ, సూయారహితాత్ము లగుచు సూరిజను లుపా
దేయంబుగఁ గొని వినఁ దగుఁ, బాయక వినకున్నఁ బ్రత్యవాయము గల్గున్.

180


క.

స్ఫీతం బై ధనధాన్యో, పేతం బై ముదిత మై యపేతదురిత మై
ఖ్యాతిగ సరయూనామన, దీతటమునఁ గోసలాఖ్యదేశం బలరున్.

181


సీ.

శ్లాఘ్యమానానంతలక్ష్మీవిలాసమై పొలుపారు వైకుంఠపురముభంగి
రాణించుఁ జతురాస్యవాణీసుహృద్యమై కమనీయసత్యలోకంబుకరణి
గురుసుధర్మామోఘసురభిశతక్రతుకలిత మై స్వర్గలోకంబుకరణి
ధననాథవరపుణ్యజనసమాకీర్ణమై, రాజిల్లు నలకాపురంబురీతి


తే.

వీరభద్రగణేశకుమారసహిత, మై నగాధీశుపురముచందానఁ దనరుఁ
గనకకలశితదినమధ్యగతమనోజ్ఞ, ధామనిధిగోపురం బయోధ్యాపురంబు.

182


ఉ.

ఆనగరంబు తొల్లి మను వానఁగరానిమనోరథంబుతో
శ్రీ నలువందఁగా సరయుచెంగట ద్వాదశయోజనాయతం
బౌ నిడుపుం ద్రియోజనమునంత తనర్పును గల్గునట్లుగా
దాని రచించె నేర్పలర ధారుణిఁ గోసలదేశమండలిన్.

183


క.

ముక్తాప్రసూనకలికా, యుక్తంబై శీతపరిమళోపేతవయ
స్సిక్తం బై తనరెడుసువి, భక్తమహాపథముచేత వఱలుచు నుండున్.

184


తే.

చారుశిల్పవిశేషంబు సర్వశస్త్ర, యంత్రములు సువిభక్తాంతరావణములు
హాటకవిచిత్రసౌధకవాటగోపు, రములు గలిగి చెలంగు నారాజధాని.

185


క.

అతులప్రభ మై సుశ్రీ, యుత మై యట్టాలకధ్వజోపేతం బై
వితతశతఘ్నీశతపరి, వృత మై యప్పురము వఱలు విశ్రుతభంగిన్.

186


తే.

సూతమాగధయుక్త యై సురుచిరామ్ర, వణమహొద్యానరచిత యై వరణదామ
కలిత యై కామినీనాటకప్రకీర్ణ, యై యనారత మప్పురి యలరుచుండు.

187


క.

కరిహరిరథోష్ట్రగోఖర, పరివృత మై ఘనగభీరపరిఖావృత మై
పరులకు దురాసదం బై, కర మద్భుతభంగిఁ బురము గ్రాలుచు నుండున్.

188


సీ.

బలిదాతృసామంతపార్థివసంఘంబు వివిధదేశాగతవిడ్జనంబు
రత్ననిర్మితబహుప్రాసాదపఙ్క్తు లత్యున్నతక్రీడాశిలోచ్చయములు