పుట:Gopinatha-Ramayanamu1.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నీహారాంశుసమానవక్త్రుల రహి న్వీక్షించి కారుణ్య ము
త్సాహంబుం జెలఁగ న్నుతించి రతిచిత్రప్రౌఢివాగ్వైఖరిన్.

166


వ.

మఱియు నీరామచరితంబు బహుకాలనిష్పన్నం బైనను బాకవిశేషంబునఁ
బ్రత్యక్షంబుగా ననుభూయమానం బైనపగిది దర్శితం బగుచున్నదాని
యిట్లు ప్రశంసించి.

167

కుశలవులకు మునీశ్వరులు బహుమతు లొసంగుట

సీ.

ఒకమౌని వల్కలం బకలంకమతి నిచ్చెఁ గరుణతో నొకమౌని కలశ మొసఁగెఁ
దపసియొక్కఁడు గూర్మి జపమాల దయచేసెఁ బ్రీతితో నొకమౌని బృసి నొసంగె
నొకసంయమీంద్రుఁ డాయువ్యంబు గృప నిచ్చె యతియొక్కఁ డిచ్చెఁ గృష్ణాజినంబు
మునిపతియొకఁ డిచ్చె ముంజియు దండంబు మఱియొక్కఁ డిచ్చెఁ గమండలువును


తే.

దపసి యొక్కఁడు యజ్ఞసూత్రం బొసంగె
మఱియుఁ బెక్కండ్రుమునులు క్రమంబుతోడఁ
దమకుఁ గలిగిన వస్తువుల్ దయ దలిర్ప
నొసఁగి రవ్వేళ నక్కుమారోత్తములకు.

168


వ.

ఇట్లు రామాయణకథాశ్రవణసంజాతపరమానందానుభవవరవశు లై మునీంద్రు
లుచితసత్కారంబుల నారాజపుత్రులఁ బ్రీతిచేతస్కులం జేసి మహాత్ముం డగు
వాల్మీకిచేత నిక్కావ్యంబు కల్పితం బయ్యె నీయాఖ్యానం బింక సమస్తకవుల
కాధారం బయి సర్వగీతంబులయం దుత్తమగీతం బై సర్వశ్రుతిమనోహరం బయి
మహాభ్యుదయకారణం బై యాయుష్కరం బై యద్భుతం బయి ప్రాశస్త్యంబు
వహించుఁ గాక యని పలికి రంత నక్కుమారు లొక్కనాఁ డయోధ్యానగర
రాజమార్గంబులందు సుధామధురపేశలసమాక్షరపాదవిచిత్రపదార్థభవ్యం బైన
యక్కావ్యంబుఁ గాంతాప్రభావతీప్రభృతిసర్వశ్రుతిమనోహరం బగునట్లుగా
గానంబు చేసిన.

169


క.

 కలరవ మై జితకోకిల, కులరవమై యారవం బకుంఠితగతి వీ
నులవిం దై యమృతపుసో, నలపొందై పురమునిండ నలువుగ మ్రోసెన్.

170


ఉ.

మ్రోసిన నాలకించి రఘుముఖ్యుఁడు రాముఁడు భూరిసమ్మదో
ల్లాసవిలాసి యై తపనరాజులకైవడిఁ గ్రాలువారిఁ బే
రాసఁ గనుంగొన న్నిజగృహంబునకుం బిలిపించి మించి సీ
తానుభగుండు పేశలసుధామధురోక్తి బహూకరించుచున్.

171

శ్రీరాముండు గుశలవులం దనగృహంబునకు రావించుట

వ.

సచివసామంతభ్రాతృసమన్వితంబుగా నొక్కకమనీయకాంచనకమ్రకిరణసముజ్జ్వ
లదివ్యసింహాసనంబున నాసీనుం డయి యుదయమహీధరోపరిభాగసముజ్జ్వల