పుట:Gopinatha-Ramayanamu1.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

తనవెంటం జలకుండిఁ గైకొని భరద్వాజుండు సంతోషి యై
చనుదేరంగ ననేకవైఖరుల భాస్వత్పద్యభావంబు శి
ష్యునకుం జెప్పుచు నాశ్రమంబునకుఁ బుణ్యోదారుఁ డేతెంచి తా
ననిశధ్యాతత్పర్థవర్ణపదుఁ డై యాసీనుఁ డై యుండఁగన్.

138

వాల్మీకిమహర్షికడకు పరమేష్ఠి యేతెంచుట

ఉ.

బంగరుటంచతేజిపయి బాగుగ నెక్కి సనందనాదులుం
బొంగుచు వెంట రాఁగ నలుమోముల వేదరవంబు లుప్పతి
ల్లం గమలాసనుండు మునిరాజును బుణ్యచరిత్రుఁ గన్గొనన్
సంగతి మీఱ వచ్చె సురసాధ్యులు మ్రోల జొహారు సేయఁగన్.

139


ఉ.

వచ్చినధాతఁ గాంచి మునివర్యుఁడు దిగ్గున లేచి యాత్మలో
నొచ్చెము లేనిభక్తిరస మూరఁ బ్రదక్షిణముం బ్రణామము
న్మెచ్చుగ నాచరించి తమి మించి యథావిధిఁ బూజ లిచ్చి తా
నచ్చుగ ఫాలభాగఘటితాంజలియై గురుబుద్ధి నుండఁగన్.

140


క.

వసజాసనుండు ముదమునఁ బనిగొని వాల్మీకిదత్తపరమాసనమం
దనువుగ నాసీనుండై, మునిపతిఁ గూర్చుండఁ బనిచె మునుకొని ప్రేమన్.

141


వ.

ఇట్లు బ్రహ్మచేత ననుజ్ఞాతుండై వామలూరుతనయుం డుచితనిజాసనంబునం గూ
ర్చుండి క్రౌంచగతం బైనచిత్తంబున ధ్యానంబుఁ బూని యెవ్వండు చారుర
వం బైనతాదృశక్రౌంచంబు నకారణంబుగా వధించె నట్టి నిషాదుం డెంత పా
పాత్ముం డెంత వైరగ్రహణబుద్ధి యయ్యె నని సారెసారెకుఁ గ్రౌంచాంగన
నుద్దేశించి దుఃఖించుచు హృద్గతావశోత్పన్నశ్లోకార్థంబునందు నివేశితచిత్తుం
డై సాక్షాల్లోకపితామహుం డైన పరమేష్టి కిట్లనియె.

142


మ.

కలుషాత్ముండు నిషాదుఁ డొక్కఁ డలుకం గ్రౌంచంబు హింసింపఁగాఁ
గలఁక న్భర్తృనియోగదుఃఖమున నాక్రందించు క్రౌంచాంగన
న్బెలుచం గన్గొని యేను శోకమున వానిం దిట్టితిం దిట్ట న
ప్పలుకుల్ వి న్మొకపద్య మై తనరె శుంభల్లక్షణోపేతమై.

143


వ.

అని పలికి యాశ్లోకంబుఁ బఠించి దేవా యిది యేమి కారణంబున నుత్పన్నం
బయ్యె నాశ్చర్యరసావిష్టచిత్తుండ నై యున్నవాఁడ నెఱింగింపవే యని యభ్య
ర్థించిన నాకర్ణించి విరించి యుదంచితకరుణాకటాక్షవీక్షణంబుల నిరీక్షించి మదా
జ్ఞానుసారంబున నపతీర్ణ మైనసరస్వతి నెఱుంగఁ డయ్యె నని మందహాసంబుఁ
జేసి యిట్లనియె.

144


తే.

తాపసోత్తమ మత్ప్రసాదమునఁ జేసి, భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె
నట్లు గాకున్న నీచేత ననఘ నేఁడు, పరఁగ నీశ్లోక మిబ్భంగి బద్ధ మగునె.

145


తే.

అనఘ నీమీఁది కూర్మిచే నమరమౌని, నారదుఁడు సర్వలోకవిశారదుండు